జాబితాలో మృతుల ఓట్లు తొలగించండి | - | Sakshi
Sakshi News home page

జాబితాలో మృతుల ఓట్లు తొలగించండి

May 9 2025 2:07 AM | Updated on May 9 2025 2:10 AM

జాబితాలో మృతుల ఓట్లు తొలగించండి

జాబితాలో మృతుల ఓట్లు తొలగించండి

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో మృతుల ఓటర్లను తొలగించేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సుమిత్‌ కుమా ర్‌ గాంధీ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పారదర్శక ఓటర్ల జాబితా తయారీకి చర్యలు చేపట్టాలన్నారు. బీఎల్వోలు క్షేత్రస్థాయిలో వైద్యఆరోగ్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని మృతుల ఓట్లను తొలగించాలన్నారు. జిల్లాలో ఎన్‌సీడీ 3.0 సర్వే చేస్తున్నట్లు తెలిపా రు. ఈ సర్వేలో ప్రతి కుటుంబంలోని వివరాలను సేకరిస్తున్నారన్నారు. ఫారం 6 కు 3,595 దరఖాస్తులు అందగా 2,297, ఫారం 7 లో 3,034 దరఖాస్తులు అందగా అందులో 1,889, ఫారం 8 లో 5,304 దరఖాస్తులకు 4,177 దరఖాస్తులు పరిష్కరించినట్లు తెలిపారు. మృతి చెందిన, మల్టిపుల్‌ ఓటర్లను జాబితాను తొలగించేలా, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుండడంతో నూతన ఓటర్లకు కార్డుల పంపిణీ, ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి ఓటర్ల జాబితాలో పేర్ల మార్పునకు సంబంధించిన అంశాలను పరిశీలించాలని వివిధ పార్టీల ప్రతినిధులు కోరారు. ఈ సమావేశంలో డీఆర్వో మోహన్‌కుమార్‌, వైఎస్సార్‌ సీపీ పార్టీ తరఫున ఉదయ్‌కుమార్‌, ఇతర పార్టీల నుంచి బాలసుబ్రహ్మణ్యం, సురేంద్రకుమార్‌, యశ్వంత్‌, అట్లూరి శ్రీనివాసులు, పరదేశి, భాస్కర్‌, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ వాసుదేవన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement