ప్రజల పక్షాన పోరాడండి | - | Sakshi
Sakshi News home page

ప్రజల పక్షాన పోరాడండి

May 3 2025 7:38 AM | Updated on May 3 2025 7:38 AM

ప్రజల

ప్రజల పక్షాన పోరాడండి

మాయగాళ్లకు‘మన్ను’దన్ను
సుందరీకరణ పేరుతో కూటమి నేతలు చిత్తూరు కట్టమంచి చెరువు నుంచి మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారు.
– 10లో
రోడ్డు పనులకు రూ.72 కోట్లు

వడగండ్ల వాన.. పంటలకు నష్టం

చిత్తూరు జిల్లాలోని పలు చోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. పెనుగాలులకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి.

శనివారం శ్రీ 3 శ్రీ మే శ్రీ 2025

తిరుపతికి వెళ్లే బస్సులు రాక చిత్తూరు

బస్టాండ్‌లో నిరీక్షిస్తున్న ప్రయాణికులు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): కూటమి నేతలు చిత్తూరు జిల్లా నుంచి 130 బస్సుల సేవలను అమరావతికి మళ్లీంచారు. దీంతో చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్‌ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. సకాలంలో గమ్యస్థానానికి చేరుకోలేక ప్రయాణికులు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. నిత్యం బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు పడరాని పాట్లు పడ్డారు. రాజధాని పనుల పునఃప్రారంభానికి శుక్రవారం దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమరావతికి వచ్చారు. ఇందుకు జనసమీకరణ చేయడానికి కూటమి నేతలు జిల్లాలో మహిళలు, కూటమి పార్టీల కార్యకర్తలు, నాయకులను ఆర్టీసీలో బస్సుల్లో గురువారమే అమరావతికి తరలించారు. ఇందుకు జిల్లాలోని ఐదు ఆర్టీసీ డిపోల నుంచి 130 బస్సులను ఆర్టీసీ అధికారులు వారికి కేటాయించారు. మిగిలిన అరకొరగా బస్సులను స్థానికంగా నడిపారు. దీంతో బస్సులు లేక ప్రయాణికులు గమ్యం చేరడానికి కుస్తీ పట్టాల్సివచ్చింది.

గంటల తరబడి నిరీక్షణ

వివిధ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు బస్టాండ్‌కు చేరుకున్న ప్రయాణికులు బస్సులు లేక పోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. చిన్న పిల్లలతో వచ్చిన వారు, చికిత్స కోసం వచ్చి తిరుగు ప్రయాణమైనవారు.. వృద్ధులు బస్టాండ్లలో నిరీక్షించి, నీరసించిపోయారు. కొంత మంది తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాల్లో గమ్యానికి చేరుకున్నారు. పీఎం సభకు తరలించిన బస్సులు అత్యధిక శాతం గ్రామీణ ప్రాంతాలకు చెందినవి కావడంతో గ్రామీణ ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అరకొరగా ఉన్న బస్సుల్లో సీట్ల కోసం నువ్వా? నేనా? అన్నట్లు ఫీట్లు చేయాల్సివచ్చింది. అధికంగా తిరుపతి, బెంగళూరు, పీలేరు, పలమనేరు, పుంగనూరు, మదనపల్లి, తవణంపల్లి, పెనుమూరు, జీడీనెల్లూరు కడప తదితర మార్గాల్లో నిత్యం బస్సులు రద్దీగా కనిపిస్తుంటాయి. ఈ మార్గాల్లో నడిచే బస్సులను కూడా రాజధానికి మళ్లించారు. దీంతో ఆయా మార్గాల్లో ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. దీనికితోడు ఎండ వేడమి ఎక్కువగా ఉండడంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. చిన్నారులు, వృద్ధులు, మహిళలు ఉక్కపోతతో విలవిలాడారు.

మళ్లీ అప్పులు తప్పవా..?

టీడీపీ గత ఐదేళ్ల పాలనలో ఆర్టీసీ చంద్రబాబు సేవలకు మాత్రమే పరిమితమైంది. ప్రయాణికుల సేవలను పక్కన పెట్టింది. టీడీపీ ప్రభుత్వ సమావేశాలు, పోలవరం షోలకు బస్సులను మళ్లించారు. ఆర్టీసీ కూడా అవసరమైనప్పుడల్లా కావాల్సినన్ని బస్సులను పంపింది. 2015 అక్టోబర్‌ నుంచి 2019 వరకు వివిధ ప్రాంతాల్లో జరిగే సభలు, పోలవరం విహారయాత్రకు మొత్తం 1,292 సర్వీసులను వినియోగించుకున్నారు. ఇందుకుగాను జిల్లాలోని వివిధ డిపోలకు రూ.4 కోట్ల మేర బకాయిలు పడింది. అప్పట్లో వారు చెల్లించింది రూ.14.64 లక్షలు మాత్రమే. మళ్లీ ఇలా సభలకు వెళ్లిన బస్సులకు సుమారు రూ.1.10 కోట్ల మేర చెల్లించాల్సి ఉంటుందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి.

చిత్తూరు ఆర్టీసీ బస్టాండులో ఖాళీగా ఉన్న బెంగళూరు స్టాప్‌

‘నీట్‌’కు పకడ్బందీ ఏర్పాట్లు

చిత్తూరు కలెక్టరేట్‌ : నీట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ ఆదేశించారు. శుక్రవారం ఆయన చిత్తూరులో నీట్‌ నిర్వహించనున్న కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీ లించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ నగరంలోని పీవీకేఎన్‌, సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాలల్లో ఈ నెల 4వ తేదీన నీట్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆయా కేంద్రాల్లో వి ద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. పీవీకేఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 432 మంది, సావిత్రమ్మ మహిళా ప్రభు త్వ డిగ్రీ కళాశాలలో 278 మంది విద్యార్థులు నీట్‌కు హాజరుకానున్నట్లు తెలిపారు. మధ్యా హ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందని వివరించారు. సెంటర్‌లోకి ఎలక్ట్రానిక్‌ వస్తువులు తీసుకురాకుండా పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎస్పీ మణికంఠ చందోలు, పీవీకేఎన్‌ ప్రిన్సిపల్‌ జీవనజ్యోతి, సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ నరేంద్ర, పీవీకేఎన్‌ కళాశాల పరీక్షల విభాగం కో–ఆర్డినేటర్‌ శరవణ పాల్గొన్నారు.

వ్యవసాయ జిల్లా కార్యాలయం ఏఓగా అంజయ్య

గుడిపాల: జిల్లా వ్యవసా య కార్యాలయం పరిపా లన అధికారిగా గుడిపాల మండలం 189కొత్తపల్లెకు చెందిన అంజయ్య శుక్రవారం పదవీ భాధ్యతలు చేపట్టారు. ఆయన ఇక్కడే సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ ఏఓగా ఉద్యోగోన్నతి పొందారు.

జగనన్నపై ‘చిట్టి’ అభిమానం

పలమనేరు: అభిమానానికి హద్దులు లేవనేమాట నిజమే. గంగవరం మండలం నలసానపల్లెకు చెందిన డ్రైవర్‌ బాలాజీకి జగన్‌మోహన్‌రెడ్డి అంటే చాలా అభిమానం. ఆయన పుట్టినరోజుకు సైతం తిరుమలకు కాలినడకన వెళ్లి వచ్చారు. ఎన్నికల వేళ తన ఇంటికి కట్టుకొనేందుకు తీసుకెళ్లిన పార్టీ బ్యానర్లు, జెండాలను జాగ్రత్తగా పెట్టుకున్నారు. ఇతని మూడేళ్ల కుమార్తె చిట్టికి సైతం జగన్‌మోహన్‌రెడ్డి అంటే చాలా ఇష్టం. టీవీలో ఆయన కనిపించగానే జగన్‌ మామ అంటూ కేరింతలు కొడుతోంది. దీంతో గ్రామంలో గంగజాతర మొదలైంది. కాస్త విభిన్నంగా ఆలోచించిన బాలాజీ తన కుమార్తెకు పార్టీకి చెందిన జెండాలు, బ్యానర్‌ను టైలర్‌కిచ్చి బిడ్డకు దుస్తులు కుట్టించాడు. వాటిని ధరించిన చిట్టి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. దుస్తులు వేసుకుని గ్రామంలో చెంగుచెంగున వెళుతుంటే గ్రామస్తులు సైతం ఆ చిన్నారిని చూసి భలే ఉంది పాప డ్రెస్‌ అంటూ ఆశ్చర్యంగా తిలకించారు.

చిత్తూరు కార్పొరేషన్‌: జిల్లాలో ఆర్‌అండ్‌ బీ పరిధిలోని రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. జిల్లాలోని పలు రహదారులు 221 కిలోమీటర్ల మేర పనులు చేపట్టడానికి రూ.72 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెద్దమల్లెల–ఎర్రావారి పాళెం రోడ్డుకు రూ.1.50 కోట్లు, చిత్తూరు–పు త్తూరు రోడ్డు నుంచి కమ్మకండ్రిగ రోడ్డు రూ.2 కో ట్లు, చిత్తూరు–తిరుత్తణి రహదారి నుంచి వేలూ రు రోడ్డు రూ.2 కోట్లు, నగరి నుంచి వెంగన్న కండ్రిగ రోడ్డుకు రూ.2 కోట్లు, అడవిబుదుగూరు క్రా స్‌ నుంచి తమిళనాడు సరిహద్దు వరకు రూ.1.20 కోట్లు కేటాయించారు. కుప్పం–సంగనపల్లె రోడ్డు రూ.70 లక్షలు, కుప్పం–పొగురుపల్లె–గుడుప ల్లెరూ.70 లక్షలు, రామకుప్పం–వి.కోట పేర్నంబట్టు రోడ్డుకు రూ.1.35 కోట్లు మంజూరు చేశా రు. అలాగే బందార్లపల్లె క్రాస్‌ నుంచి పాముగానిపల్లె రో డ్డు రూ.67 లక్షలు, రామకుప్పం–వి.కోట–పేర్నంబట్టు రోడ్డు రూ.1.90 కోట్లు, కుప్పం– చిగురుగుంట రోడ్డుకు రూ.2.65 కోట్లు, గుడ్డూరు నుంచి కర్ణాటక సరిహద్దు (వయా కేనుమాకుపల్లె, పెద్దూరు) రోడ్డుకు రూ.1.85 కోట్లు, గుడ్యాణంపల్లె–దిన్నేపల్లె రోడ్డు రూ.85 లక్షలు, 64 పెద్దూరు నుంచి కర్లగట్ట రోడ్డు రూ. 68 లక్షలు మంజూరు చేశారు. కుప్పం సరిహద్దు రహదారి నిర్మాణానికి రూ.4.95 కోట్లు, గుడ్యాణంపల్లె రోడ్డు రూ.1.15 కోట్లు, కుప్పం – గుడుపల్లె రోడ్డు రూ.80 లక్షలు, కుప్పం–పొగురుపల్లె రోడ్డు రూ. 84 లక్షలు, గు డ్యాణంపల్లె నుంచి తమిళనాడు సరిహద్దు వరకు రూ.3.55 కోట్లు, ఎన్‌హెచ్‌ 219 క్రాస్‌ రోడ్డు రూ.40 లక్షలు, యామిగానిపల్లె రోడ్డు రూ.1.05 కోట్లు,పలమనేరు–కృష్ణగిరి బైపాస్‌ రోడ్డు రూ.79 లక్షలు, కుప్పం–పట్చూరు రోడ్డు రూ.3.84 కో ట్లు, కుప్పం–మల్లానూరు రోడ్డుకు రూ.6.05 కో ట్లు కేటాయించారు. పలమనేరు – కృష్ణగిరి రోడ్డు కు రూ.40 లక్షలు, వెంకటపల్లె నుంచి కర్ణాటక సరిహద్దు వరకు రోడ్డుకు రూ.50 లక్ష లు, కుప్పం–పలమనేరు రోడ్డు రూ.4.05 కోట్లు, కుప్పం– గుడుపల్లె రూ.6.02 కోట్లు, కుప్పం–పెద్దపర్తికుంట రూ.5.16 కోట్లు, రామకుప్పం–విజలాపురం రూ.3.85 కోట్లు, సీకేటీ రోడ్డు–పాకాల–దామలచెరువు రూ.2.20 కోట్లు, రాయలపేట–మాధవరం రూ.2.20 కోట్లు, రాయలపేట–కల్లుపల్లె రోడ్డుకు రూ.4.45 కోట్లు కేటాయించారు.

– మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి

చౌడేపల్లె: ప్రతి కార్యకర్త జగనన్న సైనికుడిలా ప్రజల పక్షాన నిలబడి పోరాడాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి సూచించారు. శుక్రవారం తిరుపతిలోని పెద్దిరెడ్డి స్వగృహంలో చౌడేపల్లె మండలంలోని 19 పంచాయతీలకు చెందిన నేతలు, కార్యకర్తలు వారిని కలిశారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరిగిన దాడులు, అన్యాయాలు, ఆక్రమణలు, కార్యకర్తలకు కలిగిన కష్టనష్టాల గురించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డికి వివరించారు. ఎమ్మెల్యే, ఎంపీ మాట్లాడుతూ కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా తామున్నామని, అధైర్యపడొద్దని భరో సా ఇచ్చారు. కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని, అందరికీ తగిన గుర్తింపు ఉంటుందన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీలోని బలోపేతం చేయడంతోపాటు గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, చేకూరిన లబ్ధిని వివరిస్తూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను తెలిపి, ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలప్పుడు ప్రజలకిచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలు నెరవేర్చలేదని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి కార్తకర్త సైనికుల్లా కష్టపడి పనిచేయాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వంపై పోరాడి, పేద ప్రజలకు న్యాయం చేయడమే ధ్యేయంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దామోదరరాజు, వైస్‌ ఎంపీపీలు నరసింహులు యాదవ్‌, సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు అంజిబాబు, రుక్మిణమ్మ, వెంకటరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నాగభూషణరెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు మిద్దింటి కిషోర్‌బాబు, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కళ్యాణ్‌ భరత్‌, సర్పంచుల సంఘం అధ్యక్షుడు కృష్ణారెడ్డి, సింగిల్‌విండో మాజీ చైర్మన్‌ రవిచంద్రారెడ్డి, పార్టీ స్టీరింగ్‌ కమిటీ జిల్లా సభ్యుడు పద్మనాభరెడ్డి, జి.శ్రీనివాసులురెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే, ఎంపీకి సత్కారం

వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడిగా నియమితులైన జి.నాగభూషణరెడ్డి, పార్టీ నేతలతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిని ఘనంగా సత్కరించారు. తనపై నమ్మకంతో అప్పజెప్పిన బాధ్యతలను నిర్వర్తించడానికి అహర్నిశలు కష్టపడి పనిచేస్తానన్నారు. పార్టీ బలోపేతం చేయడంతోపాటు గ్రామస్థాయి నుంచి ప్రజల మద్దతుతో ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. పెద్దిరెడ్డి కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు.

– 10లో

– 10లో

న్యూస్‌రీల్‌

ఆర్టీసీ బస్సులు అమరావతి సభకు మళ్లింపు

జిల్లా నుంచి 130 బస్సులు

ప్రయాణికులకు తిప్పలు

ఆర్టీసీ బస్సుల సమాచారం..

డిపోల సంఖ్య – 5

మొత్తం బస్సులు – 400

పల్లెవెలుగు – 233

ఎక్స్‌ప్రెస్‌ – 100

సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ – 33

సూపర్‌లగ్జరీలు – 30

ఇంద్ర – 04

రోజువారీ తిరిగే కి.మీ – 1.50 లక్షలు

రాకపోకలు సాగించే

ప్రయాణికుల సంఖ్య – 1.11 లక్షలు

గతంలో యాత్రలు, సభలకు

టీడీపీ ప్రభుత్వం తీసుకున్న బస్సులు – 1,292

అప్పట్లో బకాయిలు – రూ4 కోట్లు

బకాయిల్లో అప్పట్లో

చెల్లించింది.. – 14.64 లక్షలు మాత్రమే

ఇప్పుడు పీఎం సభకు

తీసుకున్న బస్సులు – 130

బస్సులకు చెల్లించాల్సిన

నగదు – రూ.1.10 కోట్లు (సుమారు)

చిత్తూరు జిల్లాలో బస్సుల కొరత ప్రయాణికులను వేధించింది. గంటల కొద్దీ బస్టాండ్లలో నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ అమరావతి పర్యటన నేపథ్యంలో జిల్లా నుంచి జన సమీకరణ చేయాలని కూటమి ప్రభుత్వం సంకల్పించింది. జిల్లా నలుమూలల నుంచి జనాన్ని అమరావతికి తరలించేందుకు సన్నద్ధమైంది. ఇందుకోసం గురువారం రాత్రి నుంచి పలు ఆర్టీసీ సర్వీసులను వినియోగించుకుంది. దీంతో బస్సు సర్వీసులు రద్దు అయ్యాయి. ఫలితంగా సకాలంలో బస్సులు లేక ప్రయాణికులకు ప్రయాణం ప్రయాసగా మారింది.

డిపోల వారీగా అమరావతికి పంపిన బస్సుల సంఖ్య

డిపో పేరు పంపిన బస్సులసంఖ్య

చిత్తూరు వన్‌డిపో 30

చిత్తూరు టూడిపో 35

పుంగనూరు 35

పలమనేరు 10

కుప్పం 20

తిరుపతి బస్సులను కూడా మళ్లిస్తే ఎట్టా?

నేను ప్రతిరోజు తిరుపతి–చిత్తూరు వస్తుంటాను. పని చూసుకుని సాయంత్రం 5 గంటల కల్లా తిరుపతికి బస్సు ఎక్కెలా చూసుకుంటున్నాను. డైలీ సాఫీగానే ప్రయాణం సాగుతోంది. 5 నుంచి 10 నిమిషాల్లో బస్సులు దొరికేది. అయితే శుక్రవారం బస్సు కోసం గంటల తరబడి వేచి చూస్తున్నా. బస్సులు అర్ధగంటకు ఒకటి వస్తోంది. అది కూడా బెంగళూరు బస్సు మాత్రమే. అన్నీ బస్సుల్లోనూ సీట్లు ఫుల్‌గా ఉన్నాయి. నిలబడి వెళదామనుకున్నా కుదరడం లేదు. తిరుపతికి వెళ్లే బస్సులను కూడా మళ్లించడం కరెక్టు కాదు.

– విజి, తిరుపతి–చిత్తూరు ప్రయాణికుడు

నేడు ఇదే పరిస్థితి..?

అమరావతికి జనాన్ని తరలించిన బస్సులు తిరిగి శనివారం ఆయా డిపోలకు చేరుకునే అవకాశం ఉంది. దీంతో వివిధ మార్గాల్లో రద్దు చేసిన బస్సు సర్వీసులను శనివారం సాయంత్రం తర్వాతనే ఆర్టీసీ అధికారులు పునురుద్ధరించనున్నారు. అప్పటి వరకు ప్రయాణికులు ప్రైవేటు వాహనాల్లో అధిక చార్జీలు చెల్లించి, ప్రయాణించాల్సి పరిస్థితి నెలకొంది.

221 కిలోమీటర్ల మేర

పలు రోడ్లు నిర్మాణం

కుప్పం–మల్లానూరు రోడ్డుకు అత్యధికం

ప్రజల పక్షాన పోరాడండి 1
1/8

ప్రజల పక్షాన పోరాడండి

ప్రజల పక్షాన పోరాడండి 2
2/8

ప్రజల పక్షాన పోరాడండి

ప్రజల పక్షాన పోరాడండి 3
3/8

ప్రజల పక్షాన పోరాడండి

ప్రజల పక్షాన పోరాడండి 4
4/8

ప్రజల పక్షాన పోరాడండి

ప్రజల పక్షాన పోరాడండి 5
5/8

ప్రజల పక్షాన పోరాడండి

ప్రజల పక్షాన పోరాడండి 6
6/8

ప్రజల పక్షాన పోరాడండి

ప్రజల పక్షాన పోరాడండి 7
7/8

ప్రజల పక్షాన పోరాడండి

ప్రజల పక్షాన పోరాడండి 8
8/8

ప్రజల పక్షాన పోరాడండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement