త్వరితగతిన విచారణ చేయండి | - | Sakshi
Sakshi News home page

త్వరితగతిన విచారణ చేయండి

Mar 11 2025 1:22 AM | Updated on Mar 11 2025 1:19 AM

చిత్తూరు అర్బన్‌: ప్రజలు ఇచ్చే వినతులపై త్వరితగతిన విచారణ జరిపి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశించారు. చిత్తూరు నగరంలోని ఏఆర్‌ కార్యాలయంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. చీటింగ్‌, కుటుంబ తగదా లు, భూతగదాలు, భర్త వేధింపులు తదితర సమస్యలపై ప్రజలు నేరుగా ఎస్పీని కలిసి వినతిపత్రాలు సమర్పించారు. ఇలా మొత్తం 41 వినతులు వచ్చాయి. వీటిపై పూర్తి స్థాయి లో విచారణ జరిపి న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు.

నూనె గింజల సాగుకు ప్రణాళికలు సిద్ధం చేయండి

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో నూనె గింజల సా గుకు పటిష్ట ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ ఆదేశించారు. సో మవారం కలెక్టరేట్‌లో జిల్లా ఆయిల్‌ సీడ్‌ మెషిన్‌ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడు తూ జిల్లాలో విస్తీర్ణం, ఉత్పత్తి దిగుబడి లక్ష్యాల ఆధారంగా నూనె గింజల సాగుకు ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. మండలాల వారీగా క్షేత్రస్థాయిలో ఎఫ్‌పీఓల భాగస్వామ్యంతో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు, రైతుల ఆస క్తి, ప్రభుత్వం అందించే సహాయ సహకారాలు సంబంధిత విషయాలపై అవగాహన పెంచి, సమగ్ర నివేదికను తయారు చేయాలన్నారు. నూనె గింజల సాగుకు అవసరమైన విత్తనాల పంపిణీ, రైతులకు శిక్షణ, క్లస్టర్‌ ఫ్రంట్‌లైన్‌ ప్రదర్శనల (సీఎఫ్‌ఎల్‌డీలు) పర్యవేక్షణ, పంట బీమా, సూక్ష్మ నీటిపారుదల, వ్యవసాయ రుణం సంబంధిత అంశాలపై చర్చించాలన్నా రు. జిల్లాలో ప్రస్తుతం నూనెగింజల పంటల్లో వేరుశనగ మొదటి స్థానంలో ఉందన్నారు. త రువాత సీసం, పొద్దుతిరుగుడు గింజల సాగు, ఆయిల్‌ సీడ్‌ ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ట్రైనీ కలెక్టర్‌ హి మవంశీ, వ్యవసాయ శాఖ ఏడీ సావిత్రి, నా బార్డ్‌ డీడీఎం సునీల్‌, డీటీఓ రామచంద్ర, శాస్త్రవేత్త సంధ్య, ఏడీ కోటేశ్వర రావ్‌, తదితరులు పాల్గొన్నారు.

17న సంకటహర చతుర్థి

కాణిపాకం: శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవ స్థానంలో ఈనెల 17వతేదీన సంకటహర చతుర్థి వత్రం నిర్వహించనున్నట్లు ఈఓ పెంచలకిషోర్‌ తెలిపారు. ఈ వ్రతం ఆలయ ఆస్థాన మండపంలో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు జరపనున్నట్లు పేర్కొన్నారు. అలాగే రాత్రి 7 గంటలకు స్వర్ణ రథోత్సవం ఉంటుందన్నారు. వ్రత పూజల్లో పాల్లోనే భక్తులు ముందస్తుగా ఆన్‌లైన్‌లో టికెట్లు పొందవచ్చని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement