ముఖ్యమంత్రి.....
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు పక్షపాతి. అన్నదాతల అభ్యున్నతి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారు. గిట్టుబాటు ధర కోసం కూడా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద జిల్లాలో 237 గ్రూపులకు రూ.4.17 కోట్ల రాయితీతో 111 ట్రాక్టర్లును పంపిణీ చేశాం’ అని రాష్ట్ర అటవీ, విద్యుత్, శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనుల శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చిత్తూరులో శుక్రవారం వైఎస్సార్ యంత్ర సేవా పథకం జిల్లా స్థాయి కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు.