రిలయన్స్‌ జోరు, బుల్‌ దౌడు | Sensex rises 650 pts Nifty above16500 | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ జోరు, బుల్‌ దౌడు

Jul 20 2022 10:05 AM | Updated on Jul 20 2022 10:06 AM

Sensex rises 650 pts Nifty above16500 - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో కళకళలాడుతున్నాయి. గ్లోబల్‌ మార్కెట్ల సానుకూల సంకేతాల నడుమ స
సెన్సెక్స్ 600 పాయింట్లు  ఎగిసింది. నిఫ్టీ 16500 పైన ఉత్సాహంగా  కొనసాగుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 646 పాయంట్లు లాభంతో 55414 వద్ద నిఫ్టీ 187 పాయింట్ల లాభంతో 16528 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. 

టెక్ ఎం, రిలయన్స్ టాప్ గెయినర్లుగా కొనసాగుతున్నాయి. విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపుతో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇతర ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ షేర్లలో కొనుగోళ్లు  కనిపిస్తున్నాయి.  అలాగే హిందుస్తాన్ యూనిలీవర్‌లో ఫలితాల జోష్‌ కనిపిస్తోంది. ఇంకా  ఇండస్‌ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఇన్ఫోసిస్,  టైటాన్  భారీగా లాభపడుతుండగా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎం అండ్‌ ఎం, ఐటీసీ మాత్రమే నష్టపోతున్నాయి. 
 

Advertisement
 
Advertisement
Advertisement