తొమ్మిది ఎన్‌బీఎఫ్‌సీల లైసెన్స్‌లు సరెండర్‌ | RBI Announces Voluntary Exit of Nine NBFCs from Market | Sakshi
Sakshi News home page

తొమ్మిది ఎన్‌బీఎఫ్‌సీల లైసెన్స్‌లు సరెండర్‌

Sep 13 2025 9:18 AM | Updated on Sep 13 2025 9:18 AM

RBI Announces Voluntary Exit of Nine NBFCs from Market

ఫోన్‌పే టెక్నాలజీ సర్వీసెస్‌ సహా తొమ్మిది నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు) సర్టిఫికేషన్‌ ఆఫ్‌ రిజిస్ట్రేషన్‌ (సీవోఆర్‌/లైసెన్స్‌లు)ను స్వాధీనం చేసినట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. ఎన్‌బీఎఫ్‌సీ వ్యాపారం నుంచి తప్పుకోవడంతో ఫోన్‌పే టెక్నాలజీ సర్వీసెస్‌ సీవోఆర్‌ను వెనక్కిచ్చేసింది.

ఆదిత్య బిర్లా ఫైనాన్స్‌ తన మాతృ సంస్థ ఆదిత్య బిర్లా క్యాపిటల్‌లో విలీనం కావడంతో లైసెన్స్‌ను స్వాధీనం చేసింది. ఆర్‌బీజీ లీజింగ్‌ అండ్‌ క్రెడిట్, యషిలా ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఫైనాన్స్, తదితర కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి.

లైసెన్స్‌లు సరెండర్‌ చేయడానికి కారణాలు..

  • ఆర్‌బీఐ నిబంధనలకు అనుగుణంగా ఎన్‌బీఎఫ్‌సీ  నిర్మాణం ఇకపై వారి వ్యాపార లక్ష్యాలతో సరపోదని కొన్ని కంపెనీలు తెలుసుకున్నాయి. ఉదాహరణకు ఫోన్ పే టెక్నాలజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ రుణాలు, ఇతర ఆర్థిక సేవల నుంచి వైదొలిగింది. నియంత్రిత విభాగాల్లో వ్యాపారం ముందుకు సాగదని నమ్మి స్పష్టమైన వైఖరితో రిజిస్ట్రేషన్‌ను తిరిగి ఇచ్చేసింది.

  • ఆదిత్య బిర్లా ఫైనాన్స్ తన మాతృ సంస్థతో విలీనం తరువాత లైసెన్స్‌ను సరెండర్ చేసింది. ఏకీకృత వ్యాపార సంస్థ కింద కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.

  • కొన్ని ఎన్‌బీఎఫ్‌సీలు తమ రుణ కార్యకలాపాలను మూసివేయడానికి లేదా ప్రత్యామ్నాయ, అనియంత్రిత ఆర్థిక నమూనాలకు మారడానికి నిర్ణయం తీసుకున్నాయి. దాంతో ఈ రిజిస్ట్రేషన్‌ అనవసరంగా భావిస్తున్నాయి.

ఇదీ చదవండి: ఎలక్ట్రిక్‌ బైక్‌పై రూ.35,000 వరకు ఆఫర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement