అందరికీ ఉపాధి: పీపుల్స్‌ కమిషన్‌ కీలక నివేదిక | India needs Rs13-52 lakh cr annual investment for full employment says Study | Sakshi
Sakshi News home page

అందరికీ ఉపాధి: పీపుల్స్‌ కమిషన్‌ కీలక నివేదిక

Oct 14 2022 9:01 AM | Updated on Oct 14 2022 9:02 AM

India needs Rs13-52 lakh cr annual investment for full employment says Study - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వం పని చేసే హక్కును తీసుకురావాల్సిన అవసరం ఉందని, అందరికీ ఉపాధి కల్పించేందుకు వీలుగా జీడీపీలో ఏటా 5 శాతం చొప్పున (సుమారు రూ.13.52 లక్షల కోట్లను) కేటాయించాలని ఓ సంస్థ సూచించింది. దేశ్‌  బచావో అభియాన్‌ ఏర్పాటు చేసిన ‘పీపుల్స్‌ కమిషన్‌ ఆన్‌ ఎంప్లాయిమెంట్, అన్‌ఎంప్లాయిమెంట్‌’ ఈ నివేదికను విడుదల చేసింది. ఏవో నామమాత్రపు నిధుల కేటాయింపులతో పూర్తి స్థాయి ఉపాధి కల్పన అసాధ్యమని అభిప్రాయపడింది.

చట్టంలోనూ, సామాజిక-రాజకీయ, ఆర్థిక విధానాల్లోనూ గణనీయమైన మార్పులు అవసరమని పేర్కొంది. దేశ పౌరులకు తగినంత ఉపాధి కల్పించేందుకు ‘రైట్‌ టు వర్క్‌’ చట్టాన్ని తేవాలని కోరింది. దేశంలో పనిచేసేందుకు 21.8 కోట్ల మంది సిద్ధంగా ఉన్నారంటూ.. వీరికి ఉపాధి కల్పించేందుకు జీడీపీలో ఏటా 5 శాతం నిధుల కేటాయింపు అవసరాన్ని ప్రస్తావించింది. అలాగే, ఏటా ఒక శాతం చొప్పున ఐదేళ్లపాటు పెంచుతూ వెళ్లాలని సూచించింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని పొందుతున్న వారిని ఈ గణాంకాల నుంచి మినహాయించింది. ఉపాధి కల్పన పెరిగితే అది పెద్ద ఎత్తున ఉత్పత్తికి దారితీస్తుందని, తద్వారా డిమాండ్‌ బలోపేతం అవుతుందని సూచించింది. ప్రస్తుతం దేశంలో 30.4 కోట్ల మందికే సరైన ఉపాధి ఉన్నట్టు తెలిపింది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement