ముంబై: ప్రపంచదేశాలు కరోనాతో పోరాటం చేస్తున్న సమయంలో.. భారత కార్పొరేట్ కంపెనీలు ఆదాయాలను కోల్పోయినా.. తమ లాభాలను మాత్రం తెలివిగా కాపాడుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–2021) తొలి త్రైమాసికం (ఏప్రిల్ నుంచి జూన్ వరకు/క్యూ1)లో కంపెనీల ఆదాయాలు ఏకంగా 31 శాతం మేర పడిపోగా.. అదే సమయంలో లాభాల క్షీణత 3.6 శాతానికే పరిమితమైనట్టు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఓ నివేదికలో తెలియజేసింది. 489 కంపెనీల క్యూ1 ఫలితాలను విశ్లేషించిన అనంతరం ఇక్రా ఈ వివరాలను విడుదల చేసింది. మొదటి త్రైమాసికంలో జీడీపీ ఏకంగా మైనస్ 23.9 శాతానికి పడిపోయిన విషయాన్ని గుర్తు చేసింది.
మొదటి రెండు నెలలు (ఏప్రిల్, మే) దేశవ్యాప్తంగా పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించడమే కారణంగా పేర్కొంది. స్థూల ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉండడం వల్ల జూన్ త్రైమాసికానికి ముందు వరుసగా మూడు త్రైమాసికాల్లోనూ కార్పొరేట్ కంపెనీల ఆదాయాలు తగ్గుతూ వస్తున్నప్పటికీ.. జూన్ త్రైమాసికంలో మాదిరి భారీ క్షీణతను ఎప్పుడూ చూడలేదని ఇక్రా స్పష్టం చేసింది. ‘‘తయారీ, పారిశ్రామిక, నిర్మాణ, వినియోగ కార్యకలాపాలపై క్యూ1లో ఎక్కువ భాగం నియంత్రణలు కొనసాగాయి. ఇదే ప్రధానంగా కంపెనీల ఆర్థిక పనితీరుపై ప్రభావం చూపించింది’’ అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ శంషేర్ దేవాన్ తెలిపారు.
నివేదికలోని అంశాలు..: వినియోగ ఆధారిత రంగాలలో ఆదాయాల క్షీణత ఎక్కువగా ఉంది. అంతక్రితం ఏడాది జూన్ త్రైమాసికంతో పోలిస్తే 2020 జూన్ క్వార్టర్లో ఆదాయాలు సగం మేర పడిపోయాయి. ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల్లో, కొనుగోలు శక్తి క్షీణించడం వల్ల వినియోగదారులు ఖరీదైన కొనుగోళ్లకు దూరంగా ఉన్నారు. విచక్షణారహిత వినియోగం కిందకు వచ్చే ఎయిర్లైన్స్, హోటళ్లు, రిటైల్, ఆటోమోటివ్, కన్జూమర్ డ్యూరబుల్స్ రంగాలపై ఎక్కువ ప్రభావం పడింది. అదే ఎఫ్ఎంసీజీ, కన్జూమర్ గూడ్స్ విభాగాలపై తక్కువ ప్రభావం పడింది. పన్నుకు ముందస్తు మార్జిన్లు క్యూ1లో 3.6 శాతానికి పరిమితమయ్యాయి. అంతక్రితం మార్చి త్రైమాసికంలో మార్జిన్లు 4.3 శాతంగా ఉన్నాయి. మార్జిన్లు ఎక్కువగా ప్రభావితమైన వాటిల్లో ఎయిర్ లైన్స్, హోటళ్లు, రిటైల్, హెల్త్ కేర్, జెమ్స్ అండ్ జ్యుయలరీ రంగాలున్నాయి. చారిత్రక కనిష్టాలకు పడిపోయిన మార్జిన్లు ప్రస్తుత త్రైమమాసికం నుంచి క్రమంగా మెరుగుపడతాయి.
ఆదాయాలు క్షీణించినా.. లాభాలు స్థిరమే
Published Mon, Sep 7 2020 4:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement