ఐరా రియల్టీ ఎండీ నర్సిరెడ్డికి అవార్డ్‌ | Champions of change Telangana to honour exemplary achievers of Telangana | Sakshi
Sakshi News home page

ఐరా రియల్టీ ఎండీ నర్సిరెడ్డికి అవార్డ్‌

Feb 26 2022 6:19 AM | Updated on Feb 26 2022 6:19 AM

Champions of change Telangana to honour exemplary achievers of Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఐరా ఎండీ పోశం నర్సిరెడ్డిని చాంపియన్‌ ఆఫ్‌ ఛేంజ్‌ తెలంగాణ అవార్డ్‌ వరించింది. సుప్రీంకోర్టు్ట మాజీ న్యాయమూర్తి, ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్మన్‌ కేజీ
బాలక్రిష్ణన్‌ చేతుల మీదుగా ఈ అవార్డ్‌ను అందుకున్నారు. ధైర్యం, సమాజ సేవ, సమ్మిళిత సామాజిక అభివృద్ధి విలువలను ప్రోత్స హించడంలో వ్యక్తులు, సంస్థ లు చేసిన కృషికి గుర్తింపుగా చాం పియన్స్‌ ఆఫ్‌ ఛేంజ్‌ నేషనల్‌ అవార్డ్‌లను ప్రదానం చేస్తుంటుంది. నిర్మాణ రంగం నుంచి మైహోమ్‌ గ్రూప్‌ ఫౌండర్‌ అండ్‌ చైర్మన్‌ జూపల్లి రామేశ్వర్‌రావుకు కూడా అవార్డ్‌ దక్కింది. ఈ అవార్డ్‌తో బాధ్యత పెరిగిందని, నంబర్‌ 1 రియల్టీ టెక్నాలజీ కంపెనీగా నిలిపేలా కృషి చేస్తానని నర్సిరెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement