ఖమ్మం జిల్లా వాసికి ‘వీరశౌర్య దివస్‌’ అవార్డు | - | Sakshi
Sakshi News home page

ఖమ్మం జిల్లా వాసికి ‘వీరశౌర్య దివస్‌’ అవార్డు

Apr 13 2026 7:56 AM | Updated on Apr 13 2026 7:56 AM

ప్రధాని చేతుల మీదుగా అందుకున్న నూతనప్రసాద్‌

నేలకొండపల్లి: మండలంలోని మంగాపుర తండాకు చెందిన ఆర్మీ జవాన్‌ భూక్యా నూతనప్రసాద్‌ విధినిర్వహణలో ప్రతిభకు గాను గుర్తింపు లభించింది. 2024లో మణిపూర్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడులను తిప్పికొట్టటంలో ఆయన ప్రతిభ కనపరిచారు. ఈ సందర్భంగా నూతనప్రసాద్‌కు కేంద్రప్రభుత్వం వీరశౌర్య దివస్‌ అవార్డు ప్రకటించింది. ఢిల్లీలో ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఆయనకు అవార్డు అందజేయగా కుటుంబీకులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement