కిన్నెరసానిలో క్రిస్మస్ సందడి
పాల్వంచరూరల్: క్రిస్మస్ వేడుకల సందర్భంగా కిన్నెరసానికి పర్యాటక రద్దీ పెరిగింది. శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ కూడా సందర్శించి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. 988 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా, వైల్డ్లైఫ్ శాఖకు రూ.52,110 ఆదాయం లభించింది. 400 మంది బోటు షికారు చేయగా, టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.23,900 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. మొత్తం రూ.86,010 ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది.


