
క్రీడలతో మానసిక ఒత్తిడి దూరం
పాల్వంచరూరల్: క్రీడలతో మానసిక ఒత్తిడి దూరమవుతుందని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. మండలంలోని కిన్నెరసానిలోని క్రీడాపాఠశాల మైదానంలో ఆదివారం భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ఉద్యోగులకు క్రికెట్ టోర్నీ నిర్వహించారు. ఐటీడీఏ పీఓ జట్టు, భద్రాచలం జోన్, దమ్మపేట, ఇల్లెందు ఐటీడీఓ జట్లు పాల్గొన్నాయి. పీఓ పోటీలను ప్రారంభించి, మాట్లాడారు. విధి నిర్వహణలో అలసిపోయిన ఉద్యోగులకు ఇలాంటి క్రీడలు ఎంతో ఉత్సాహాన్నిస్తాయని చెప్పారు. కాగా, ఫైనల్ మ్యాచ్లో ఐటీడీఏ పీఓ జట్టు, భద్రాచలం జోన్ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన భద్రాచలం జోన్ జట్టు పది ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేశారు. పీఓ జట్టు పది ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసి విజయం సాధించి కప్పును కై వసం చేసుకుంది. అయితే, ఐటీడీఓ పీఓ బి.రాహుల్ 9 పరుగులు చేయడమే కాక మూడు వికెట్లు తీశారు. కార్యక్రమంలో దమ్మపేట ఏటీడబ్ల్యూఓ చంద్రమోహన్, స్పోర్ట్స్ ఆఫీసర్ గోపాల్రావు, ఏఎస్ఓ వెంకటనారాయణ, నాగేశ్వరరావు, శంకర్, ఎం.బాలు, పి.వెంకటేశ్వర్లు, హరికృష్ణ, కబీర్ పాల్గొన్నారు.