ఇండస్ట్రియల్‌ పార్ట్‌నర్‌షిప్‌ డ్రైవ్‌ పోస్టర్‌ విడుదల | - | Sakshi
Sakshi News home page

ఇండస్ట్రియల్‌ పార్ట్‌నర్‌షిప్‌ డ్రైవ్‌ పోస్టర్‌ విడుదల

Oct 16 2025 5:53 AM | Updated on Oct 16 2025 5:53 AM

ఇండస్ట్రియల్‌ పార్ట్‌నర్‌షిప్‌ డ్రైవ్‌ పోస్టర్‌ విడుదల

ఇండస్ట్రియల్‌ పార్ట్‌నర్‌షిప్‌ డ్రైవ్‌ పోస్టర్‌ విడుదల

ఇండస్ట్రియల్‌ పార్ట్‌నర్‌షిప్‌ డ్రైవ్‌ పోస్టర్‌ విడుదల రైలులో ప్రయాణికురాలిపై అత్యాచారం అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి రెండేళ్ల జైలు ఆధిపత్య పోరుతోనే హత్య

లక్ష్మీపురం: ఏపీఐఐసీ – ఇండస్ట్రీ పార్ట్‌నర్‌షిప్‌ డ్రైవ్‌ పోస్టర్‌ను జిల్లా కలెక్టర్‌ ఎ.తమీమ్‌ అన్సారియా విడుదల చేశారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కార్యక్రమం జరిగింది. నవంబర్‌ 14, 15వ తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న భాగస్వామ్య సదస్సు (పార్టన్నర్‌ షిప్‌ సమ్మిట్‌)లో భాగంగా ఈ పోస్టర్‌ విడుదల చేశామని తెలిపారు. పీసీబీ కార్యనిర్వాహక ఇంజినీరు ఎం.డి.నజీనా బేగం, ఏపీఐఐసీ జీఎం డాక్టర్‌ ఎం.ఎల్‌ నరసింహారావు, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం ఎ. జయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

– కత్తితో బెదిరించి అఘాయిత్యం చేసిన దుండగుడు

లక్ష్మీపురం: మహిళల బోగీలో ఒంటరిగా ఉన్న ప్రయాణికురాలిపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారం చేశాడు. సెల్‌ఫోన్‌, నగదు తీసుకుని పారిపోయాడు. రైల్వే పోలీసుల సమాచారం మేరకు.. రాజమండ్రి ప్రాంతానికి చెందిన సుమారు 35 ఏళ్ల ఓ మహిళ మంగళవారం సంత్రగచి స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు చర్లపల్లి వరకు వెళ్లేందుకు ఎక్కారు. గుంటూరు రైల్వే స్టేషన్‌ వద్దకు వచ్చేసరికి ఆ బోగీలో అందరూ దిగిపోయారు. ఇదే అదనుగా ఓ గుర్తు తెలియని వ్యక్తి లోపలికి చొరబడ్డాడు. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలంలోకి వచ్చాక ఆ మహిళను కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె నుంచి రూ.5,600 నగదు, సెల్‌ఫోన్‌ లాక్కుని పెదకూరపాడు స్టేషన్‌కు సమీపంలో రైలులో నుంచి దూకి పారిపోయాడు. బాధితురాలు సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గుంటూరు నుంచి పెదకూరపాడు ప్రాంతాల మధ్యలో సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

మంగళగిరి టౌన్‌: యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి రెండేళ్ల సాధారణ జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానా విధిస్తూ మంగళగిరి అడిషనల్‌ జుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌క్లాస్‌ కమ్‌ సివిల్‌ జడ్జి, జూనియర్‌ డివిజన్‌ ఎం.ప్రసన్న లక్ష్మి బుధవారం వెలువరించారు. మంగళగిరి రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళగిరి మండలంలోని నూతక్కి గ్రామానికి చెందిన ఓ యువతి 2019లో ఇంటి వద్ద స్నానం చేస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన బోళ్ల వెంకటరెడ్డి తొంగిచూశాడు. ఆమె గమనించి ఇంట్లోకి వెళ్లారు. అతడూ వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు వచ్చారు. నిందితుడు పరారయ్యాడు. మంగళగిరి రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై శ్రీనివాసరెడ్డి కేసు దర్యాప్తు అనంతరం చార్జిషీట్‌ దాఖలు చేశారు. నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తాజాగా తీర్పు వెలువరించారు. అసిస్టెంట్‌ ప్రాసిక్యూటర్‌ ఎ.శివలీల ప్రాసిక్యూషన్‌ నిర్వహించారు.

తెనాలిరూరల్‌: తెనాలిలో కలకలం సృష్టించిన హత్య కేసును పోలీసు ఛేదించినట్టు సమాచారం. బాపట్ల జిల్లా అమృతలూరు మండలం కోరుతాడిపర్రుకు చెందిన జూటూరి తిరుపతిరావు అలియాస్‌ బుజ్జి తెనాలిలో మంగళవారం దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే నిందితుడిని గుర్తించినట్టు తెలిసింది. గ్రామంలోని రామాలయం విషయంలో ఆధిపత్య పోరు ఉన్న వరుసకు అల్లుడయ్యే వ్యక్తే హత్యకు ప్పాడ్డాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement