పులిచింతలకు 2,32,037 క్యూసెక్కులు విడుదల | - | Sakshi
Sakshi News home page

పులిచింతలకు 2,32,037 క్యూసెక్కులు విడుదల

Sep 1 2025 2:53 AM | Updated on Sep 1 2025 2:53 AM

పులిచింతలకు 2,32,037 క్యూసెక్కులు విడుదల

పులిచింతలకు 2,32,037 క్యూసెక్కులు విడుదల

సత్రశాల(రెంటచింతల): మండలంలోని సత్రశాల వద్ద నున్న నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌ విద్యుత్‌ ప్రాజెక్టు రిజర్వాయర్‌ 17 క్రస్ట్‌ గేట్ల ద్వారా 2,32,037 క్యూసెక్కులు పులిచింతలకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఎస్‌ఈ వెంకటరమణ, ఈఈ సుబ్రమణ్యం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టెయిల్‌పాండ్‌ ప్రాజెక్టు రిజర్వాయర్‌ తొమ్మిది క్రస్ట్‌గేట్లు మూడు మీటర్లు, ఎనిమిది క్రస్ట్‌గేట్లు 2.5 మీటర్లు ఎత్తు ఎత్తి 2,32,037 క్యూసెక్కుల వరదనీటిని దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు నీటిమట్టం 75.50 మీటర్లకుగాను 74.58 మీటర్లకు చేరుకుందన్నారు. రిజర్వాయర్‌ గరిష్ట నీటి సామర్ధ్యం 7.080 టీఎంసీలకుగాను ప్రస్తుతం 6.462 టీఎంసీలు నీరు నిల్వ ఉందన్నారు. టీఆర్‌సీ లెవల్‌ 60.54 మీటర్లకు చేరుకుందన్నారు. ఎగువ నున్న నాగార్జునసాగర్‌ నుంచి 2,89,876 క్యూసెక్కుల వరదనీరు ఇక్కడ ప్రాజెక్టుకు చేరుకుంటుందన్నారు. ప్రస్తుతం విద్యుత్‌ ప్రాజెక్టులోని రెండు యూనిట్ల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేసినట్లు వెల్లడించారు. నాగార్జునసాగర్‌ నుంచి వచ్చే వరదను బట్టి దిగువనున్న పులిచింతలకు నీటిని విడుదల చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement