ముగిసిన జిల్లా ఫెన్సింగ్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన జిల్లా ఫెన్సింగ్‌ పోటీలు

Aug 27 2025 8:51 AM | Updated on Aug 27 2025 8:51 AM

ముగిస

ముగిసిన జిల్లా ఫెన్సింగ్‌ పోటీలు

ముగిసిన జిల్లా ఫెన్సింగ్‌ పోటీలు పొగాకు కొనుగోలు నిరంతరం జరగాలి

గుంటూరు వెస్ట్‌ (క్రీడలు): ఉమ్మడి గుంటూరు జిల్లా ఫెన్సింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక బీఆర్‌ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్‌–17 బాలబాలికల పోటీలు ముగిశాయి. జిల్లా కార్యదర్శి డి.అశోక్‌ బాబు మాట్లాడుతూ ఈ పోటీల్లో ప్రతిభకనబరచిన వారిని ఈ నెల 30న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరగనున్న అంతర్‌ జిల్లాల పోటీలకు పంపిస్తామని తెలిపారు. పోటీలను ఖేలో ఇండియా కోచ్‌ చిరంజీవి, డీఎస్‌ఏ కోచ్‌ కె.సంగీత బాబు ఆధ్వర్యంలో నిర్వహించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఫెన్సింగ్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ డి.ఎస్‌. క్రిష్టోఫర్‌, కోచ్‌లు పాల్గొన్నారు.

గుంటూరు వెస్ట్‌: జిల్లాలో రైతుల నుంచి పొగాకు కొనుగోలు ప్రక్రియ నిరంతరం జరగాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎ.భార్గవ్‌తేజ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయనన మాట్లాడారు. ప్రభుత్వంతోపాటు, ప్రైవేటు కంపెనీలు కూడా రైతుల నుంచి కొనుగోలు చేయాలని ఆయన తెలిపారు. జిల్లాలో 3,895 మంది రైతులు పొగాకు సాగు చేయగా, 3,370 మంది రైతులు ప్రభుత్వానికి విక్రయించేందుకు సీఎం యాప్‌లో నమోదు చేసుకున్నారని జేసీ వెల్లడించారు. కొనుగోలు కోసం ఇప్పటి వరకు 1,614 మంది రైతులకు షెడ్యూల్‌ ఇచ్చారని తెలిపారు. ఏపీ మార్కెట్‌మార్క్‌ఫెడ్‌ ద్వారా 1063 మంది రైతుల నుంచి ప్రభుత్వం 2,200 టన్నులు కొనుగోలు చేసిందని చెప్పారు. ప్రైవేటు కంపెనీలు కూడా 3,500 టన్నులు కొనుగోలు చేశాయని తెలిపారు. ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన 2,800 టన్నుల పొగాకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్‌ ఇచ్చారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరరావు, మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ టి.నరసింహారెడ్డి, పొగాకు రైతులు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

ముగిసిన జిల్లా ఫెన్సింగ్‌ పోటీలు 1
1/1

ముగిసిన జిల్లా ఫెన్సింగ్‌ పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement