పండుగ తరువాతే డీఎస్సీ నియామక ప్రక్రియ | - | Sakshi
Sakshi News home page

పండుగ తరువాతే డీఎస్సీ నియామక ప్రక్రియ

Aug 26 2025 7:34 AM | Updated on Aug 26 2025 7:34 AM

పండుగ తరువాతే డీఎస్సీ నియామక ప్రక్రియ

పండుగ తరువాతే డీఎస్సీ నియామక ప్రక్రియ

గుంటూరు ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ వినాయకచవితి పండుగ తరువాతే ప్రారంభం కానుంది. ఇటీవల ప్రకటించిన డీఎస్సీ–2025 ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులతో వివిధ కేటగిరీల వారీగా ఆయా పోస్టులకు ఎంపికై న వారికి పాఠశాల విద్యాశాఖ సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను ఈనెల 28 నుంచి చేపట్టనుంది. విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం సోమవారం ప్రారంభం కావాల్సిన సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను మంగళవారానికి వాయిదా వేసిన అధికారులు వినాయకచవితి పండుగ సెలవు దృష్ట్యా మరోసారి వాయిదా వేశారు. సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను గురువారం నుంచి చేపట్టేందుకు షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక సోమవారం ‘సాక్షి’కి తెలిపారు.

ఏసీ కళాశాల వేదిక

ఉమ్మడి గుంటూరు జిల్లాలో భర్తీ చేయనున్నట్లు డీఎస్సీ నోటిఫికేషన్‌లో పొందుపర్చిన 1,143 పోస్టులకు గతంలో 25,067 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో మొత్తం 43,570 దరఖాస్తులు అందాయి పురుషులు 8,431, మహిళలు 16,636 మంది ఉన్నారు. పరీక్షల ఫలితాలను ఇటీవల విడుదల చేశారు. ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను గురువారం నుంచి గుంటూరులోని ఏసీ కళాశాలలో చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యాశాఖ కార్యాలయం ద్వారా నేరుగా సమాచారాన్ని పంపుతారని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగు చర్యలు చేపడతామని డీఈఓ సీవీ రేణుక చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement