నాగిరెడ్డికి మదర్‌ థెరెస్సా జాతీయ పురస్కారం | - | Sakshi
Sakshi News home page

నాగిరెడ్డికి మదర్‌ థెరెస్సా జాతీయ పురస్కారం

Aug 25 2025 8:13 AM | Updated on Aug 25 2025 8:13 AM

నాగిరెడ్డికి మదర్‌ థెరెస్సా జాతీయ పురస్కారం

నాగిరెడ్డికి మదర్‌ థెరెస్సా జాతీయ పురస్కారం

నాగిరెడ్డికి మదర్‌ థెరెస్సా జాతీయ పురస్కారం

కారంచేడు: మండలంలోని యర్రంవారిపాలెం గ్రామానికి చెందిన మదర్‌ సర్వీస్‌ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు మున్నంగి నాగిరెడ్డికి మదర్‌ థెరెస్సా జాతీయ ప్రతిభా పురస్కారం లభించింది. ఆదివారం అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం సీఆర్‌సీ కన్వెన్షన్‌ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డు ప్రదానం చేసినట్లు నాగిరెడ్డి తెలిపారు. మదర్‌ థెరెస్సా ఎడ్యుకేషన్‌ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్‌ దిండ్ల కిషోర్‌ సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో తమ ట్రస్ట్‌ ద్వారా చేసిన అనేక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేశారని పేర్కొన్నారు. 16 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో చేసిన సంక్షేమ, అభివృద్ధి, సేవా కార్యక్రమాలను ప్రదర్శించామన్నారు. సీఆర్‌సీ వ్యవస్థాపక అధ్యక్షుడు విక్టరీ వెంకటరెడ్డి, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ రమణమ్మ, శివకుమార్‌, చంద్ర సుబ్బారెడ్డి, నరేష్‌కుమార్‌రెడ్డి, డాక్టర్‌ వడియార్‌, వీరరాఘవరెడ్డి చేతుల మీదుగా తనకు అవార్డును అందించామని నాగిరెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement