బాబోయ్‌.. వెజి‘ట్రబుల్స్‌’ | - | Sakshi
Sakshi News home page

బాబోయ్‌.. వెజి‘ట్రబుల్స్‌’

Jul 19 2025 3:46 AM | Updated on Jul 19 2025 3:46 AM

బాబోయ

బాబోయ్‌.. వెజి‘ట్రబుల్స్‌’

అద్దంకి: వర్షాభావ పరిస్థితుల కారణంగా కూరగాయల ధరలు మండిపోతున్నాయి. రెండు రోజుల్లోనే ధరలు రెట్టింపు కావడంతో సామాన్యులు, పేదలు బెంబేలెత్తిపోతున్నారు. వందలు ఖర్చు చేసినా ఓ చిన్న కుటుంబానికి నాలుగైదు రోజులకు సరిపడా కూరగాయాలు రావడం లేదు. పచ్చి మిర్చి ధర కిలో రూ.120కి చేరుకుంది. మిగిలిన కూరలు కిలో రూ.50పైగానే పలుకుతున్నాయి. మరో వైపు నిత్యావసర వస్తువుల ధరలు కూడా చేతికందే పరిస్థితి లేకపోవడంతో పేదలు కనీసం పచ్చడి మెతుకులు వండుకోవడానికీ ఆలోచించాల్సి వస్తోంది. ప్రతి వంటకు అవసరమైన పచ్చిమిర్చితో పాటు మునగ కాయలు కూడా కొండెక్కాయి. కిలో పచ్చిమిచ్చి నాలుగు రోజుల కిందట రూ.50 ఉండగా, ప్రస్తుతం రూ.120 చేరుకుంది. మునగ రూ.120 పలుకుతోంది. రూ.20 ఉండే బీర, దోస ధరలు రూ.60కి పైమాటే. ఇక క్యారెట్‌, బీట్రూట్‌ రూ.70 పలుతున్నాయి. చిక్కుడు ధర రూ.90కి పైమాటే. టమోటా కిలో ధర రూ.40 వరకు పలుకుతోంది. ఆకుకూరల ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో సామాన్యుడు విలవిల్లాడిపోతున్నాడు. వర్షాలు లేకపోవడంతో కూరగాయలు పండలేదని, సుదూరప్రాంతాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకోవాల్సి రావడంతోనే ధరలు బాగా పెరిగిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం వర్షాలు పడినా, ఈ ప్రాంతంలోని భూముల్లో కూరగాయలు పండి మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చేసరికి కనీసం నలభై నుంచి యాభై రోజులు పడుతుందని, అప్పటివరకూ ఈ ధరలు భరించక తప్పదేమోనని ప్రజలు భయపడుతున్నారు.

కూరగాయ రకం ధర (రూ)

పచ్చి మిర్చి 120

మునగకాయలు 120

చిక్కుళ్లు 90

క్యారెట్‌ 80

బీట్రూట్‌ 70

బంగాళాదుంప 50

దోస 40

బెండ 60

బీర 60

కొండెక్కిన కూరగాయల ధరలు

మంట పుట్టిస్తున్న పచ్చిమిర్చి

బాబోయ్‌.. వెజి‘ట్రబుల్స్‌’ 1
1/1

బాబోయ్‌.. వెజి‘ట్రబుల్స్‌’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement