
ప్రజా పాలనపై ఎన్టీఆర్ చెరగని ముద్ర
గుంటూరు వెస్ట్: సంక్షేమ పాలనతో ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేసిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును ఎప్పటికీ మరచిపోలేమని ఇన్చార్జి జిల్లా కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ కొనియాడారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో ఇన్చార్జి కలెక్టర్తోపాటు శాసన మండలి సభ్యులు చంద్రగిరి ఏసురత్నం, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఎ.భార్గవ్ తేజ మాట్లాడుతూ ప్రభుత్వ పాలనలో విప్లవాత్మకమైన మార్పులకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో స్టెప్ సీఈఓ చంద్రముని, మెప్మా పీడీ విజయలక్ష్మి, కలెక్టరేట్ ఏఓ పూర్ణచంద్రరావు, కార్పొరేటర్లు స్మిత పద్మజ, వెంకట రమణ, చిష్టీ, మీరావలి, పాల్గొన్నారు.
తెలుగు వారి ఖ్యాతి చాటిన ఎన్టీఆర్
నగరంపాలెం: తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు అని జిల్లా ఎస్పీ సతీష్కుమార్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో బుధవారం దివంగత సీఎం నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు రాజకీయాల్లో అరంగేట్రం చేసి సీఎంగా పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ (పరిపాలన) రమణమూర్తి, ఏఆర్ డీఎస్పీ ఏడుకొండలురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఎకై ్సజ్ కార్యాలయంలో...
నెహ్రూనగర్: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బుధవారం గుంటూరు జిల్లా ఎకై ్సజ్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ శాఖ డెప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాసులు, అసిస్టెంట్ కమిషనర్ రవికుమార్రెడ్డి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ అరుణకుమారి, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఇ.మారయ్య బాబు పాల్గొన్నారు.
ఇన్చార్జి జిల్లా కలెక్టర్

ప్రజా పాలనపై ఎన్టీఆర్ చెరగని ముద్ర

ప్రజా పాలనపై ఎన్టీఆర్ చెరగని ముద్ర