
పరిశుభ్రతతోనే ఆరోగ్య పదిలం
కర్లపాలెం: పరిశుభ్రతతోనే ప్రజల ఆరోగ్య పదిలంగా ఉంటుందని బాపట్ల జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి చెప్పారు. దమ్మనవారిపాలెం సంపద సృష్టి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గురువారం తనిఖీ చేశారు. గ్రామంలోని చెత్త తీసుకువచ్చి ఒక చోట గుట్టగా వేయటాన్ని చూసిన కలెక్టర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపద సృష్టి కేంద్రానికి తీసుకువస్తున్న చెత్తను ఎందుకు ప్రాసెసింగ్ చేయటం లేదని అఽధికారులను నిలదీశారు. తక్షణమే ప్రాసెసింగ్ పనులు చేపట్టాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ 350 గృహాలు ఉన్న గ్రామంలో చెత్తను తొలగించేందుకు క్లాప్మిత్రలు ఇద్దరే ఉండటం ఏమిటని జనాభా సంఖ్యను బట్టి క్లాప్మిత్రలను ఏర్పాటు చేసుకోవాలని డీపీవో ప్రభాకర్కు సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు వేరుగా, ఇనుప వస్తువులు వేరుగా, గాజు వస్తువులు వేరుగా భూమిలో కుళ్లిపోయే పదార్థాలు వేరుచేసి సంపద సృష్టించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ గురపసాల వెంకటేశ్వరమ్మ, ఎంపీడీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ సుందరమ్మ, ఈవోపీఆర్డీ శ్రీనివాసరావు, కార్యదర్శి సునీత తదితరులు ఉన్నారు.
కాలువల మరమ్మతులు సక్రమంగా చేయాలి
పంట కాలువల పూడికతీత, మరమ్మతు పనులు సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ జె.వెంకటమురళి జల వనరుల శాఖాధికారులను ఆదేశించారు. కర్లపాలెం మండలంలో రూ.12లక్షలతో చేపట్టిన పీటీ చానల్ మరమ్మతు పనులను గురువారం కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని పంట కాలువల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని చెప్పారు. వర్షాలు కురవకముందే పూర్తి చేయాలని తెలిపారు. జలవనరుల శాఖ ఎస్ఈ డి.వెంకటరత్నం, డీఈ జాకీర్, తహసీల్దార్ సుందరమ్మ, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఇన్చార్జి ఆర్డీవో లవన్న తదితరులు ఉన్నారు.
పర్యావరణాన్ని కాపాడుతూ పరిశ్రమలను నిర్వహించుకోవాలి
జిల్లాలో పర్యావరణాన్ని కాపాడుతూ పరిశ్రమలను నిర్వహించుకోవాలని కలెక్టర్ జె.వెంకట మురళి సూచించారు. గురువారం కలెక్టరేట్లో ఆక్వా పరిశ్రమలు, రిసార్డ్స్ యజమానులు, హోట ల్ యజమానులతో పర్యావరణ పరిరక్షణపై తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆక్వా పరిశ్రమల్లో విడుదల చేసిన వ్యర్థ పదార్థాలను నిల్వ చేయడానికి తప్పనిసరిగా అర ఎకరా భూమిని కేటాయించాలని చెప్పారు. ఆక్వా పరిశ్రమల్లో విడుదల చేసిన వ్యర్ధ పదార్థాలను పంట కాలువలోకి విడుదల చేయకుండా కట్టడి చేయాలని చెప్పారు. ఇరిగేషన్ వనరులు దెబ్బతినకుండా పర్యావర ణా న్ని కాపాడాలని యజమానులను కలెక్టర్ కోరారు. రొయ్య ప్రాసెసింగ్ యూనిట్లు ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని యాజమాన్యానికి సూచించారు. రొయ్య ప్రాసెసింగ్ యూనిట్లు 45 రోజుల్లోగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లాలో ఆక్వా యాచరీలు 20 ఉన్నాయని, వీటిలో ఏడింటికి లైసెన్న్స్లు లేవని అన్నారు. నెలరోజుల్లోగా లైసెన్సులు తీసుకోవాలని ఆదేశించారు. రిసార్డ్స్ యజమానులు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి గాజు ప్లేట్లను, బాటిల్స్ వినియోగించాలని సూచించారు. జిల్లా పంచాయతీ అధికారి, మత్స్య శాఖ జేడీ, జిల్లా పర్యాటక శాఖఅధికారి, పొల్యూషన్ బోర్డ్ అధికారులు పరిశ్రమలను, రిసార్డ్స్ను, హోటళ్లను జాయింట్గా పరిశీలన చేయా లని కలెక్టర్ ఆదేశించారు. డీపీఓ ప్రభాకర్, గ్రామీణ నీటి సరఫరాశాఖ ఎస్ఈ అనంతరాజు, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ రామకృష్ణ, పొల్యూషన్ బోర్డ్ ఈఈ రాఘవరెడ్డి,ఆర్డీవోలు పి.గ్లోరియా, చంద్రశేఖర్ ఉన్నారు.
జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళి సంపద సృష్టి కేంద్రం సందర్శన సిబ్బంది తీరుపై ఆగ్రహం