
ఎలాంటి విచారణకై నా సిద్ధం
మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు
చీరాల: తనపై అవిశ్వాస తీర్మానం పెట్టిన కౌన్సిలర్లు చేసిన అవినీతి ఆరోపణలపై ఎలాంటి విచారణకై నా తాను సిద్ధమని మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు స్పష్టం చేశారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ చాంబర్పై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్గా పదవీస్వీకారం చేసిన నాటి నుంచి నేటి వరకు చీరాల పట్టణంలో దాదాపు రూ.100 కోట్ల మేర అభివృద్ధి పనులు చేశామన్నారు. అవినీతి, అక్రమాలు జరిగాయని అనుమానిస్తే.. ఏ విచారణకై నా తాను సిద్ధమని, తనపై అవినీతి ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు. అలానే ఆయన రాజకీయ ప్రస్థానం గురించి వివరించారు. నాలుగు సంవత్సరాలుగా చైర్మన్గా బాధ్యతలు నిర్వహించానని, ఇప్పుడు తనపై అవిశ్వాస తీర్మానం చేసి తనను చైర్మన్ కుర్చీ నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.