పొగాకు రైతుకు అండగా వైఎస్సార్‌ సీపీ | - | Sakshi
Sakshi News home page

పొగాకు రైతుకు అండగా వైఎస్సార్‌ సీపీ

May 27 2025 1:58 AM | Updated on May 27 2025 1:58 AM

పొగాకు రైతుకు అండగా వైఎస్సార్‌ సీపీ

పొగాకు రైతుకు అండగా వైఎస్సార్‌ సీపీ

అద్దంకి: పొగాకు రైతుకు వైఎస్సార్‌ సీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి పానెం చిన హనిమిరెడ్డి చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 28న పొగాకు రైతుల సమస్యలు తెలుసుకోవడం కోసం పొదిలి వస్తున్నారని చెప్పారు. దీనికి సంబంధించి బాపట్ల జిల్లాలోని స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం పోరుబాట పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న రైతులు, నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం నల్ల బర్లీ సాగు చేసిన రైతు పరిస్థితి జీవన్మరణ స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వైపు దిగుబడులు పడిపోవడం, మరో వైపు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోవడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తోందన్నారు. ఆదుకోవాలని ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా స్పందించలేదన్నారు. అందుకే పొగాకు రైతుల తరఫున పోరాటం చేసేందుకు, వారికి ధైర్యం కల్పించేందుకు జగన్‌ పొదిలి రానున్నట్లు చెప్పారు. అయితే టీడీపీ నాయకులు, అక్కడ హడావుడి చేసే పరిస్థితి కనిపిస్తోందన్నారు. కానీ తమ నేత అనుకున్న కార్యక్రమం పూర్తి చేస్తారని స్పష్టం చేశారు. చేతనైతే రైతులకు సాయం చేసే విధంగా ఉండాలే తప్ప వారికి మేలు జరిగే పనిని అడ్డుకోవాలనుకుంటే ప్రజలు బుద్ధి చెప్పి తీరుతారన్నారు. తమ పార్టీ తరఫున ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు జ్యోతి హనుమంతరావు, పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, రాష్ట్ర బూత్‌ కమిటీ జాయింట్‌ సెక్రటరీ పులికం కోటిరెడ్డి, ప్రచార కమిటీ జాయింట్‌ సెక్రటరీ కోయి అంకారావు, వాణిజ్య విభాగం అధ్యక్షుడు జి.రఘురామగుప్తా, కొల్లా భువనేశ్వరి, మండల కన్వీనర్లు కృష్ణబాబు, నాగేశ్వరరావు, వివిధ మండలాల నాయకులు, కౌన్సిలర్లు, వివిధ హోదాల్లో ఉన్న మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement