
అక్రమ లే అవుట్లపై కొరడా
తోటవారిపాలెంలో లేఅవుట్ నిలిపివేత
చీరాల టౌన్: అనుమతి లేని లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ప్రజలు ఇబ్బందులు పడవద్దని తహసీల్దార్ కె.గోపీకృష్ణ సూచించారు. సోమవారం ‘సాక్షి’లో వచ్చిన ‘బరితెగించిన భూచోళ్లు’ అనే కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. మండలంలోని తోటవారిపాలెంలో అనధికారికంగా వేసిన లే అవుట్ను రెవెన్యూ అధికారులు పరిశీలించారు. లేఅవుట్కు సంబంధించిన భూమి రికార్డులను తనిఖీ చేశారు. అనధికారికంగా, అనుమతులు లేకుండా వేసిన లేఅవుట్లపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. తోటవారిపాలెం సచివాలయం సమీపంలో పంట పొలంలో వేసిన వెంచర్కు అనుమతులు లేవని, వీటిలో అమ్మకాలు చేయవద్దని అధికారులు సూచించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ చీరాల మండలంలోని రూరల్ గ్రామాల్లో అనుమతులు లేకుండా ప్లాట్లు వేస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని తెలిపారు. ప్రజలు కూడా అన్నీ అనుమతులు ఉంటేనే కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. అనుమతులు లేని ప్లాట్లు కొని ఆర్థికంగా నష్టపోవద్దని తెలిపారు. గ్రామాల్లో అక్రమంగా వేసిన, వేస్తున్న లేఅవుట్లను క్షుణ్ణంగా పరిశీలనలు చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ గోపీకృష్ణ తెలిపారు.

అక్రమ లే అవుట్లపై కొరడా