‘తల్లికి వందనం’ ఎప్పుడంటూ ప్రశ్నిస్తున్న జనం | - | Sakshi
Sakshi News home page

‘తల్లికి వందనం’ ఎప్పుడంటూ ప్రశ్నిస్తున్న జనం

Apr 25 2025 8:20 AM | Updated on Apr 25 2025 8:20 AM

‘తల్ల

‘తల్లికి వందనం’ ఎప్పుడంటూ ప్రశ్నిస్తున్న జనం

శుక్రవారం శ్రీ 25 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

నేడు ప్రత్యేక గ్రీవెన్స్‌

బాపట్ల: ఎస్టీలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్‌ను ప్రతినెలా మూడవ శుక్రవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ జె. వెంకటమురళి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమస్యలు విన్నవించుకోవడానికి జిల్లాలో దివ్యాంగులు, ఎస్టీలు ప్రత్యేక గ్రీవెనన్స్‌సెల్‌కు రావచ్చన్నారు. ఈ విషయాన్ని జిల్లాలోని ఎస్టీలు, దివ్యాంగులు గమనించి, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఉత్తమ జెడ్పీటీసీ

సభ్యురాలిగా ‘యార్లగడ్డ’

కారంచేడు: ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉత్తమ జెడ్పీటీసీ సభ్యురాలిగా కారంచేడు జెడ్పీటీసీ సబ్యురాలు యార్లగడ్డ రజనీ శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. జాతీయ పంచాయతీ రాజ్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఒంగోలు మల్లయ్య లింగం భవన్‌ నందు నిర్వహించబోయే ప్రత్యేక కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాలని తనకు ఆహ్వానం అందినట్లు ఆమె తెలిపారు.

బొప్పూడి ఆలయంలో

సీతారామ కళ్యాణం

చిలకలూరిపేట: బొప్పూడి గ్రామం డొంక వద్ద జాతీయ రహదారి పక్కన వేంచేసియున్న శ్రీప్రసన్నాంజనేయస్వామి దేవాలయ 42వ వార్షికోత్సవ వేడుకలు వైభంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గురువారం ఆలయ ప్రాంగణంలో సీతారామ కళ్యాణ మహోత్సవం కనుల పండువగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు మురికిపూడి సంతోష్‌ చరణ్‌ దివి పవన్‌కుమార్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.

కొండపాటూరు పోలేరమ్మకు రూ. 22.46 లక్షల ఆదాయం

ప్రత్తిపాడు: కాకుమాను మండలం కొండపాటూరు పోలేరమ్మకు తిరునాళ్ల సందర్భంగా రూ. 22.46 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో బత్తుల సురేష్‌బాబు తెలిపారు. భక్తులు పోలేరమ్మ తల్లికి సమర్పించిన కానుకలు, హుండీలను తెరిచి ఆలయంలో గురువారం లెక్కించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ పాటల ద్వారా రూ. 3.90 లక్షలు, హుండీల ద్వారా 12.76 లక్షలు, టిక్కెట్ల ద్వారా 2.40 లక్షలు, చందాల రూపంలో రూ. 39 వేలు, లడ్డూ ప్రసాద విక్రయాల ద్వారా రూ. 3 లక్షలు చొప్పున మొత్తం 22,46,256 రూపాయల ఆదాయం వచ్చినట్లు చెప్పారు. లెక్కింపు కార్యక్రమాన్ని దేవదాయశాఖ బాపట్ల ఇన్‌స్పెక్టర్‌ ఎం.గోపి, ఈవో బి. సురేష్‌లు పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఆలయ పూజారి మువ్వా రామచంద్రావు, గ్రామపెద్దలు యర్రాకుల దానయ్య, పి. శ్రీనివాసరావు, ఉత్సవకమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సాక్షి ప్రతినిధి, బాపట్ల: కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు మంగళం పాడటంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏడాది కావస్తున్నా.. పేద విద్యార్థుల చదువులకు ఎంతగానో ఉపయోగపడే తల్లికి వందనం పథకం అమలు చేయకపోవడంపై పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. జగనన్న ఇచ్చినప్పుడు మీరెందుకివ్వలేరంటూ పచ్చనేతలను నిలదీస్తున్నారు. సర్కార్‌ వంచన నేపథ్యంలో...బిడ్డలను చదివించుకునేందుకు పడుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు ‘సాక్షి’ బృందం శని, ఆదివారాల్లో బాపట్ల ప్రాంతంలోని పలు గ్రామాలు, కాలనీలను సందర్శించి విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులను పలకరించింది. బిడ్డలను చదివించుకునేందుకు వారు పడుతున్న బాధలను చూసింది. కష్టాలను ఆలకించింది.

ఆవేదన.. ఆగ్రహం

వీరేకాదు... ఎస్టీకాలనీకి చెందిన ఏడు కొండలు, సత్యవతి, చెంచుపున్నయ్య, భవానీ, ఆదర్శనగర్‌కు చెందిన శ్రీనివాసరావు, స్వప్న, రామానగర్‌కు చెందిన కొక్కిలిగడ్డ దాసుబాబు, రేవతితోపాటు పదుల

కుటుంబాల పేదలు బిడ్డలను చదివించుకునేందుకు పడుతున్న కష్టాలను ఏకరువు పెట్టారు. కూటమి సర్కార్‌ తల్లికి వందనం హామీ నమ్మి మోసపోయామంటూ వాపోయారు.

లక్షలాదిమంది తల్లుల ఎదురుచూపులు

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 1417, ప్రైవేట్‌ పాఠశాలలు 413 ఉండగా ఆయా పాఠశాలల్లో గతేడాది గణంకాల ప్రకారం 1.92 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కూటమి సర్కార్‌ హామీ ఇచ్చినట్లు ఇంటికి నలుగురికి కాకపోయినా సగటున ఇద్దరికి ఇచ్చినా మూడు లక్షలమంది పైచిలుకు విద్యార్థులకు తల్లికి వందనం ఇవ్వాల్సివుంది.

ఐఎఫ్‌సీ బృందం క్షేత్ర సందర్శన

అమరావతి: మండలంలోని పలు గ్రామాలలో గురువారం అంతర్జాతీయ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఎఫ్‌సీ) ప్రతినిధుల బృందం రైతులతో వ్యవసాయ క్షేత్ర సందర్శన, గ్రామసభలు నిర్వహించారు. తొలుత ఈ బృందం దిడుగు గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించి మిర్చి రైతులను మిర్చి ఉత్పత్తి, మార్కెటింగ్‌ గురించి అడిగి తెలుసుకున్నారు అత్తలూరులో నిర్వహించిన వ్యవసాయక్షేత్ర సందర్శనలో మొక్కజొన్న రైతులతో మాట్లాడారు. అనంతరం స్వయం సహాయక మహిళాసంఘాల సభ్యులు, రైతులతో ఆర్థిక అంశాలపై చర్చించారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌సీ బృంద సభ్యులు కె. విజయశేఖర్‌, హేమేంద్ర మెహర్‌, యువరాజ్‌ అహూజా, నవనీత్‌రాయ్‌, షెనాయ్‌ మ్యాధ్యు, ఇషాసర్‌, సీతల్‌ సోమనిలతో పాటు ఉద్యానవన శాఖ డీపీఎం అమలకుమారి, మండల, వ్యవసాయశాఖాధికారి అహ్మద్‌, ఉద్యాన అధికారి శ్రీనిత్య, అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.

న్యూస్‌రీల్‌

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఇలా..

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అమ్మ ఒడి పేరుతో ఇంటికొక బిడ్డకు ఏడాదికి రూ. 15 వేలు తల్లుల ఖాతాల్లో జమచేశారు. పాఠశాల ఫీజులతో పాటు పిల్లలకు బట్టలు, బూట్లు, ట్యాబ్‌లు ఇచ్చారు. రూ. వేలకోట్లు ఖర్చుపెట్టి కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దారు. అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులను సమకూర్చారు.

ఏడాది పాలన ముగుస్తున్నా ఇప్పటికీ ఒక్క రూపాయి ఇవ్వని వైనం బిడ్డలను చదివించుకునేందుకు అష్టకష్టాలు పడుతున్న తల్లిదండ్రులు చేతకానప్పుడు హామీ ఇవ్వడమెందుకంటూ ఆగ్రహం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్‌ సాక్షి గ్రౌండ్‌ రిపోర్ట్‌లో సర్కార్‌పై పేద కుటుంబాల ఆగ్రహం

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం జిల్లాలో ఇచ్చిన అమ్మఒడి వివరాలు

‘అన్నీ ఇవ్వాలి కదా సార్‌..’

ముత్తాయిపాలెం జెడ్పీ పాఠశాలవద్ద రామానగర్‌, ఆదర్శనగర్‌, ముత్తాయిపాలెంలకు చెందిన పలువురు విద్యార్థులను పలకరించింది ‘సాక్షి’ బృందం. తల్లికి వందనం వేయకపోవడంవల్ల మాలాంటి పేదకుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని వారు వాపోయారు. జగనన్న ఉన్నప్పుడు డబ్బులతోపాటు బట్టలు, బూట్లు, ట్యాబ్‌లు అన్నీఇచ్చారన్నారు. ‘ఇస్తామని చెప్పి ఓట్లేయించుకున్నాక అవన్నీ ఇవ్వాలి కదా సార్‌ ..మాట తప్పకూడదు కదా’ అని కూటమి ప్రభుత్వం తీరును తప్పుబట్టారు.

‘నీకు పదైదు వేలు..నీకు పదైదు వేలు, నీకు పదైదు వేలు..ఇంట్లో ఒక్కరున్నా ఇద్దరున్నా..ముగ్గురున్నా.. చివరకు నలుగురున్నా సరే ఒక్కొక్కరికీ పదైదు వేలు ఇస్తాం.’ సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు, లోకేష్‌బాబు, పవన్‌ కల్యాణ్‌, ప్రస్తుత ఇరిగేషన్‌ మంత్రి నిమ్మల రామానాయుడు సహా కూటమి నేతల ఆర్భాటపు హామీ ఇది. ఎన్నికలు ముగిసి అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ...

ఆ హామీ నెరవేర్చక పోవడంతో పిల్లలను చదివించుకునేందుకు పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు అష్టకష్టాలు పడుతున్నారు. అమలు చేతకానపుడు ఆర్భాటపు హామీలతో వంచించడమెందుకని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మోసగించడం సరికాదు..

సూర్యలంకకు చెందిన చొక్కా దారబాబు, కాంతమ్మలకు సాయిదుర్గ, మేరీ, చరణ్‌, హర్ష నలుగురు సంతానం. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో సాయిదుర్గకు అమ్మ ఒడి ఇచ్చి చదువుకు సాయమందించారు. ఇప్పుడు తల్లికి వందనం ఎంతమంది వుంటే అంతమందికిస్తామని ఓట్లేయించుకున్న కూటమి ప్రభుత్వం పైసా ఇవ్వలేదని దారబాబు కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇచ్చే మనస్సులేనపుడు హామీలివ్వడం ఎందుకని నిలదీస్తోంది. ప్రజలను మోసగించడం సరికాదంది.

‘తల్లికి వందనం’ ఎప్పుడంటూ ప్రశ్నిస్తున్న జనం 
1
1/8

‘తల్లికి వందనం’ ఎప్పుడంటూ ప్రశ్నిస్తున్న జనం

‘తల్లికి వందనం’ ఎప్పుడంటూ ప్రశ్నిస్తున్న జనం 
2
2/8

‘తల్లికి వందనం’ ఎప్పుడంటూ ప్రశ్నిస్తున్న జనం

‘తల్లికి వందనం’ ఎప్పుడంటూ ప్రశ్నిస్తున్న జనం 
3
3/8

‘తల్లికి వందనం’ ఎప్పుడంటూ ప్రశ్నిస్తున్న జనం

‘తల్లికి వందనం’ ఎప్పుడంటూ ప్రశ్నిస్తున్న జనం 
4
4/8

‘తల్లికి వందనం’ ఎప్పుడంటూ ప్రశ్నిస్తున్న జనం

‘తల్లికి వందనం’ ఎప్పుడంటూ ప్రశ్నిస్తున్న జనం 
5
5/8

‘తల్లికి వందనం’ ఎప్పుడంటూ ప్రశ్నిస్తున్న జనం

‘తల్లికి వందనం’ ఎప్పుడంటూ ప్రశ్నిస్తున్న జనం 
6
6/8

‘తల్లికి వందనం’ ఎప్పుడంటూ ప్రశ్నిస్తున్న జనం

‘తల్లికి వందనం’ ఎప్పుడంటూ ప్రశ్నిస్తున్న జనం 
7
7/8

‘తల్లికి వందనం’ ఎప్పుడంటూ ప్రశ్నిస్తున్న జనం

‘తల్లికి వందనం’ ఎప్పుడంటూ ప్రశ్నిస్తున్న జనం 
8
8/8

‘తల్లికి వందనం’ ఎప్పుడంటూ ప్రశ్నిస్తున్న జనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement