చిరుధాన్యాలపై మహిళలు అవగాహన కలిగి ఉండాలి | - | Sakshi
Sakshi News home page

చిరుధాన్యాలపై మహిళలు అవగాహన కలిగి ఉండాలి

Mar 26 2025 1:41 AM | Updated on Mar 26 2025 1:39 AM

బాపట్ల: చిరుధాన్యాలపై మహిళలు అవగాహన కలిగి ఉండాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీనివాసరావు పేర్కొన్నారు. చిరుధాన్యాలపై రైతులకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. డాక్టర్‌ చెరుకూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆహారంలో చిరుధాన్యాలు తీసుకోవడం వలన శారీరక దృఢత్వం ఏర్పడుతుందని తెలిపారు. చిరు ధాన్యాలలోని పోషక విలువలపట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. బాపట్ల వ్యవసాయ కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ పి.ప్రసూనరాణి మాట్లాడుతూ చిరుధాన్యాలలో అనేక ఖనిజాలు ఉంటాయని, ఇవి ప్రస్తుత కాలానికి ఎంతైనా అవసరమని మహిళలకు వివరించారు. జన్యుశాస్త్ర విభాగాధిపతి డాక్టర్‌ లాల్‌ అహ్మద్‌ మొహమ్మద్‌ చిరుధాన్యాల ప్రాముఖ్యత, వాటి వలన కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్ర ప్రొఫెసర్‌ డాక్టర్‌ కే.శ్రీనివాసులు, విస్తరణ విభాగాధిపతి డాక్టర్‌ ఎం.సురేష్‌కుమార్‌, కీటక శాస్త్ర ప్రొఫెసర్‌ డాక్టర్‌ టి.మధుమతి, వృక్ష శాస్త్ర అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎన్‌.కిరణ్‌కుమార్‌, డాక్టర్‌ సంపత్‌కుమార్‌, డాక్టర్‌ జి.వినయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్‌ చెరుకూరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement