జిల్లా అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి వెంకటేశ్వర్లు
నగరం: మద్యం షాపు నిర్వాహకులు ఎకై ్సజ్ చట్టాలను విధిగా పాటించాలని ఎటువంటి తప్పిదాలు చేసినా కఠిన చర్యలు తప్పవని జిల్లా అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. స్థానిక ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ పోలీస్స్టేషన్ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించారు. అనంతరం స్టేషన్ పరిధిలోని మద్యం షాపుల నిర్వాహకులతో సమావేశం నిర్వహిచారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎకై ్సజ్ చట్టాలకు అనుగుణంగా మద్యం షాపులను నడపాలన్నారు. నౌకర్ నామాలు ఎటువంటి తప్పిదాలు చేయకుండా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత లైసెన్స్దారులదేనన్నారు. ఎమ్మార్పీకే మద్యం విక్రయాలు జరపాలన్నారు. బెల్ట్షాపులకు మద్యం సరఫరా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో సీఐ మారుతి శ్రీరామ్ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా సుబ్బారెడ్డి
నరసరావుపేట ఈస్ట్: ఆంధ్రప్రదేశ్ స్విమ్మింగ్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా పట్టణానికి చెందిన వై.వి.సుబ్బారెడ్డి ఎన్నికయ్యారు. విజయవాడలో ఈనెల 23వ తేదీన అసోసియేషన్ సమావేశంలో నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నికల్లో సుబ్బారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ 4 సంవత్సరాల పాటు సేవలు అందించనుంది. పల్నాడు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శిగా సేవలు అందిస్తున్న సుబ్బారెడ్డి రాష్ట్ర అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా ఎన్నిక కావటంపై జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఏఏవీ రామలింగారెడ్డి, కోశాధికారి వై.వి.శ్రీనివాసరెడ్డి, సభ్యులు అభినందనలు తెలిపారు.
పసుపు ధరలు
దుగ్గిరాల: దుగ్గిరాల పసుపు యార్డుకు మంగళవారం 487 బస్తాలు వచ్చాయి. పసుపు మొత్తం అమ్మకం చేసినట్లు వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యదర్శి ఎన్.శ్రీనివాసరరావు ఒక ప్రకటనలో తెలిపారు. కొమ్ములు 373 బస్తాలు రాగా, వాటి కనిష్ట ధర రూ.10,500, గరిష్ట ధర రూ.11,100, మోడల్ ధర రూ.11,001 పలికింది. కాయలు 114 బస్తాలు రాగా వాటి కనిష్ట ధర రూ.10,500, గరిష్ట ధర రూ.11,100, మోడల్ ధర రూ.11,001 పలికింది.
ఎకై ్సజ్ చట్టాలను విధిగా పాటించాలి