ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కూటమి | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కూటమి

Mar 26 2025 1:41 AM | Updated on Mar 26 2025 1:37 AM

నెహ్రూనగర్‌(గుంటూరుఈస్ట్‌):కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని డెప్యూటీ మేయర్‌ వనమా బాలవజ్రబాబు ధ్వజమెత్తారు. కౌన్సిల్‌ నుంచి వాకౌట్‌ చేసిన అనంత రం విలేకర్లతో డెప్యూటీ మేయర్‌ మాట్లాడారు. కమిషనర్‌ అధికారపార్టీకి కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని మేయర్లు, డెప్యూటీ మేయర్లను, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్‌ చైర్మన్లను టీడీపీ కూటమి భయభ్రాంతులకు గురిచేస్తోందని, పచ్చజెండా పట్టుకుంటేనే పదవిలో కొనసాగుతారని ప్రలోభాలకు గురిచేస్తోందని విమర్శించారు. నగరపాలక సంస్థలో వైఎస్సార్‌ సీపీ సభ్యులు 46 మంది ఉంటే మెజార్టీ సభ్యులను తమవైపునకు తిప్పుకుందని, ఇది మున్సిపల్‌ చట్టానికి పూర్తిగా తూట్లు పొడవడమేనని అన్నా రు. కమిషనర్‌ కూడా మున్సిపల్‌ చట్టానికి తూ ట్లు పొడుస్తున్నారని విమర్శించారు. మేయర్‌ తన రాజీనామాను కలెక్టర్‌కు పంపడం ఆమోద యోగ్యం కాదని పేర్కొన్నారు. మున్సిపల్‌ యాక్ట్‌ 92(1) ప్రకారం రాజీనామా అంశాన్ని కౌన్సిల్‌లో, కౌన్సిల్‌ సెక్రటరీ ద్వారా ఆమోదించుకోవాల్సిన విషయమన్నారు. ఈ రెండు రూల్స్‌కు విరుద్ధంగా కలెక్టర్‌కు పంపిన రాజీనామా లేఖను కమిషనర్‌ కౌన్సిల్‌లో ఆమోదానికి పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కౌన్సిల్‌ సెక్రటరీ సమాధానం చెప్పాల్సి న వాటికీ కమిషనరే సమాధానం చెబుతుండటం చూస్తుంటే ఆయన సొంత చట్టాలను అమలుచేస్తున్నట్టు అర్థమవుతోందన్నారు. మేయర్‌ రాజీనామా ఆమోదం కోసం ఏర్పాటైన కౌన్సిల్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు.

అధికారపార్టీకి కమిషనర్‌ కొమ్ముకాస్తున్నారు మున్సిపల్‌ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు మేయర్‌ రాజీనామా లేఖను కలెక్టర్‌కు పంపడం ఆమోదయోగ్యం కాదు డెప్యూటీ మేయర్‌ వనమా బాలవజ్రబాబు ధ్వజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement