బాపట్ల
బుధవారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2025
కాసులు కురిపిస్తున్న
● ఎమ్మెల్యేకి నెలకు రూ.25 లక్షలు ఖరారు ● పదినెలల్లో రెండింతలు పెరిగిన కప్పం ● చీరాల నేతకు రెండు నెలల అడ్వాన్స్ చెల్లించిన మాఫియా ● బాపట్ల, వేమూరు, పర్చూరు నేతలకు నేరుగా డబ్బులు ● మంత్రుల నియోజకవర్గాల్లో ముఖ్యనేతలకు కప్పం ● నెలమామూళ్లతో సరిపెట్టుకుంటున్న అధికారులు ● పచ్చనేతల తీరుపై సర్వత్రా ఆగ్రహం
వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
దుగ్గిరాల:శవణానక్షత్రం సందర్భంగా దుగ్గిరాల వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో మంగళవారం శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణం ఘనంగా జరిగింది.
ఇఫ్తార్ సహర్
(బుధ) (గురు)
బాపట్ల 6.25 4.51
నరసరావుపేట 6.27 4.53
గుంటూరు 6.25 4.51
జిల్లాలో యథేచ్ఛగా రేషన్ బియ్యం దందా
సాక్షి ప్రతినిధి,బాపట్ల: పేదల బియ్యం అక్రమ రవాణా నియోజకవర్గ ఎమ్మెల్యేలకు కాసులు కురిపిస్తోంది. నెలానెలా రూ. లక్షల్లో మామూళ్లు తెచ్చిపెడుతోంది. దీంతో అత్యాశకు పోయి ఎమ్మెల్యేలు నెలల వ్యవధిలోనే నెల మామూళ్లు ఇబ్బడిముబ్బడిగా పెంచి అవకాశమున్న మేర దండుకుంటున్నారు. దక్షిణాఫ్రికా లాంటి దేశాల్లో చౌక బియ్యానికి డిమాండ్ పెరగడంతో రేషన్ దందా నిర్వాహకులు నియోజకవర్గ పచ్చనేతలకు అడిగినంత కప్పం చెల్లిస్తున్నారు. ఈ వ్యాపారంలో పోటీ పెరగడం పచ్చనేతలకు మరింత వరంగా మారింది. గడచిన పదినెలల్లోనే పచ్చనేతలు కప్పం 60 శాతం పెంచడం జిల్లాలో హాట్ టాఫిక్గా మారింది. రాబోయే రోజుల్లో పచ్చనేతల కప్పం మరింతగా పెరిగే అవకాశముందని ఓ బియ్యం వ్యాపారి పేర్కొనడం గమనార్హం.
మంత్రుల నియోజకవర్గాల్లో ఇలా...
మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్లకు చెందిన అద్దంకి, రేపల్లె నియోజకవర్గాల్లో మంత్రుల అంతరంగికులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు నెలకు రూ.25 లక్షల చొప్పున రేషన్దందా నుంచి కప్పం కట్టించుకుంటున్నారు. మంత్రి గొట్టిపాటి అనుచరులుగా ఉన్న నలుగురు వ్యక్తులు రేషన్దందాలో కీలకంగా మారి బాపట్ల జిల్లాతోపాటు పల్నాడు, ప్రకాశం జిల్లాల నుంచి చౌక బియ్యం సేకరిస్తున్నారు. వాటిని ప్రత్యేకంగా తీసుకున్న రైస్మిల్లుల్లో రీసైక్లింగ్ చేసి అనంతరం కృష్ణపట్నం పోర్టుకు, కొంత గుజరాత్కు తరలిస్తున్నారు. దందా నిర్వాహకులు మంత్రి పేరుచెప్పి పరిసర జిల్లాల్లో బియ్యం సేకరిస్తున్నారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ సొంత నియోజకవర్గం రేపల్లెలో నిజాంపట్నం మండలానికి చెందిన రాము రేషన్దందా నడిపిస్తున్నాడు. నియోజకవర్గ వ్యాప్తంగా చౌక బియ్యం సేకరించి వాటిని అద్దంకి బ్యాచ్కి అమ్మకానికి పెడుతున్నారు. ప్రతినెలా మంత్రి సమీప బంధువుకు రూ.25 లక్షల కప్పం చెల్లిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా చౌక బియ్యానికి డిమాండ్ పెరగడం పచ్చనేతలకు నెలనెలా కాసులు కురిపిస్తుండగా ఇక పోలీసు, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, పౌరసరఫరాల విభాగాల అధికారులకు పెద్దమొత్తంలో మామూళ్లు సంపాదించి పెడుతోంది. ఇంత జరుగుతున్నా కూటమి సర్కార్ పట్టించుకోక పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
న్యూస్రీల్
జిల్లాలో పచ్చనేతల కప్పం ధరలు..
కూటమి అధికారంలోకి రాగానే జిల్లాలోని చీరాల నియోజకవర్గంలో పచ్చనేతకు నెలకు రూ.12 లక్షలు ఇచ్చేలా రేషన్దందా నిర్వాహకులు ఒప్పందం కుదుర్చుకున్నారు. మూడు నెలలు తిరగకుండానే దానిని రూ.16 లక్షలకు పెంచారు. ఆ తర్వాత నెలకు ఒంగోలు రేషన్ దందా నిర్వాహకులు రూ.20 లక్షలకు పెంచగా ఆ మరుసటి నెలలోనే ఒంగోలుకే చెందిన మరో రేషన్ దందా బ్యాచ్ ఈ మొత్తాన్ని రూ.25 లక్షలకు పెంచి, పచ్చనేతకు రెండునెలల అడ్వాన్స్ కింద ఏకంగా రూ.50 లక్షల మొత్తాన్ని కప్పంగా చెల్లించారు. చీరాల నేతను ఆదర్శంగా తీసుకున్న మిగిలిన పచ్చనేతలు యుద్ధ ప్రాతిపదికన తమ కప్పం ధరలను ఒక్కసారిగా పెంచేశారు.
పర్చూరు నియోజకవర్గంలో ఇంకొల్లుకు చెందిన బ్రహ్మయ్య, సాంబశివరావు మరికొందరు పచ్చనేత తరపున బియ్యందందా నిర్వహిస్తున్నారు. ప్రారంభంలో పచ్చనేతకు రూ.10 లక్షలలోపు చెల్లించగా నాలుగు నెలల పాలన ముగియకుండానే ఏకంగా రూ.25 లక్షలకు పెంచారు. ఇక్కడ సేకరించిన చౌకబియ్యాన్ని రేణంగివరం, చిలుకలూరిపేట రైస్మిల్లులకు తరలించి రీసైక్లింగ్ చేసి అనంతరం అక్రమ రవాణా చేస్తున్నారు.
బాపట్లలో బియ్యం దందాను అప్పికట్ల ప్రాంతానికి చెందిన ఓ రైస్మిల్లర్ నడిపిస్తాడు. ఇక్కడి పచ్చనేతకు తొలుత రూ.15 లక్షలు చెల్లించగా ఐదు నెలల పాలన ముగియకుండానే ప్రస్తుతం రూ.25 లక్షలకు పెంచారు.
వేమూరు పచ్చనేత తరపున నియోజకవర్గంలో భట్టిప్రోలుకు చెందిన శ్రీనివాసరావు బియ్యం దందా నిర్వహిస్తున్నారు. నెలనెలా బియ్యం సేకరించి చుండూరు, కూచిపూడి రైస్మిల్లులకు తరలించి రీసైక్లింగ్ చేసి అక్కడినుంచి గుజరాత్కు ఎగుమతి చేస్తారు. ప్రారంభంలో పచ్చనేతకు రూ.20 లక్షలు కప్పం చెల్లించగా ఇప్పుడు ఆ మొత్తాన్ని ఏకంగా రూ.25 లక్షలకు పెంచారు.
రేషన్ బియ్యం
రేషన్ బియ్యం
రేషన్ బియ్యం