● వేమూరు అంబేడ్కర్ నగర్ కాలనీలో తాగునీటి ఎద్దడి ● రైల్వే ట్రాక్ దాటి నీరు తెచ్చుకుంటున్న కాలనీ వాసులు ● ఎప్పడు ఏం జరుగుతుందోనని భయాందోళన ● పట్టించుకోని అధికారులు
వేమూరు: వేసవికి ముందే వేమూరు గ్రామ పంచాయతీలోని అంబేడ్కర్ నగర్ కాలనీ వాసులకు తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. జనవరి నుంచే నీరు కోసం ఇబ్బందులు పడుతున్నారు. తాగు నీటి సమస్య గురించి పంచాయతీ కార్యదర్శికి పలుసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పంచాయతీ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని సమస్య పరిష్కారం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కాలనీలో మూడు కొళాయిలే..
అంబేడ్కర్ నగర్ కాలనీలో 250 కుటుంబాలు నివసిస్తున్నాయి. కాలనీలో మూడు కొళాయిలు వేశారు. అరకొరగా నీరు సరఫరా చేస్తుండడంతో సరిగా అందక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో నీటి కోసం రైల్వే ట్రాక్ దాటి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఎప్పుడు రైలు వస్తోందో తెలియక కాలనీ భయాందోళనకు గురవుతున్నారు.
చేతి పంపులు కూడా వేయలేదు
గ్రామ పంచాయతీ అధికారులు కనీసం చేతి పంపులు కూడా వేయలేదు. తాగునీరు రాక, చేతి పంపులు లేక నీటి కోసం నానా ఇబ్బందులు పడుతున్నాం. పంచాయతీ అధికారులు చేతి పంపులు వేయాలి. తాగు నీరు సక్రమంగా సరఫరా చేయాలి.
బొడ్డు నాగ మల్లేశ్వరి, అంబేడ్కర్ నగర్, వేమూరు.
ఇబ్బందులు పడుతున్నాం...
తాగునీటి కోసం నానా బాధలు పడుతున్నాం. వేసవిలో మరింత అవస్థలు పడుతున్నాం. సమస్యను పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. ఇప్పటికై నా సమస్యను పరిష్కరించాలి.
దాసరి సుందరమ్మ, అంబేడ్కర్నగర్, వేమూరు.
నా దృష్టికి వచ్చింది..
అంబేద్కర్ నగర్ కాలనీ ప్రజల తాగు నీటి సమస్య నా దృష్టికి వచ్చింది. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తాం.
వి భూపతిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి
పంచాయతీ అధికారులు
పట్టించుకోవడం లేదు
అంబేడ్కర్ నగర్లో తాగునీరు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. పంచాయతీ అధికారులు పట్టించు కోవడం లేదు. తాగు నీటి సమస్యపై పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం కూడా అందజేశాం.
బొనిగల అగస్టీన్, సీపీఎం నాయకుడు
250 కుటుంబాలు..మూడు కొళాయిలు
250 కుటుంబాలు..మూడు కొళాయిలు
250 కుటుంబాలు..మూడు కొళాయిలు