
రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
బాపట్ల: పనిముట్ల కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక రాయితీ రుణాలను కుల వృత్తిదారులంతా సద్వినియోగం చేసుకోవాలని బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు సూచించారు. కలెక్టరేట్ కార్యాలయంలోని స్పందన హాలులో శనివారం ఆదరణ ఫేజ్– 3 కార్యక్రమాన్ని నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఇన్చార్జి అధ్యక్షుడు బాపట్ల రవికుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈడీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే 90% రాయితీని పొందడానికి పనిముట్ల ఖరీదులో 10% ముందుగా డీడీ చెల్లించాలని తెలిపారు. మంజూరు చేసిన అనంతరం ఈ డీడీలను కార్పొరేషన్కి అందించాలని ఆయన సూచించారు. కుల వృత్తుదారుల ఆర్థిక ఎదుగుదలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. సమావేశంలో అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, స్వర్ణకార, రజక, మేదర, మొండిబండ, అగ్నికుల క్షత్రియ, బెస్త, వడ్డెర సంఘ నేతలు పాల్గొని వారి అభిప్రాయాలను తెలిపారు.
బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు