రాష్ట్ర కబడ్డీ జట్టుకు శిక్షణ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర కబడ్డీ జట్టుకు శిక్షణ ప్రారంభం

Mar 22 2025 2:04 AM | Updated on Mar 22 2025 2:03 AM

చినగంజాం: సబ్‌ జూనియర్‌ రాష్ట్ర కబడ్డీ జట్టుకు శిక్షణ కార్యక్రమాన్ని మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు ఆసోది బ్రహ్మానందరెడ్డి శుక్రవారం రాత్రి ప్రారంభించారు. వివిధ జిల్లాల నుంచి ఎంపికై న 18 మంది క్రీడాకారులతో జట్టు రూపొందింది. మండలంలోని కొత్తపాలెం పంచాయతీ పరిధిలోని బాలకోటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ నెల 24వ తేదీ వరకు శిక్షణ కొనసాగనుంది. అనంతరం తుది జట్టును ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జాతీయ స్థాయిలో బిహార్‌లో ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు పోటీలు ఉంటాయని జట్టు మేనేజర్‌ బోగిరెడ్డి స్వామిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఏఈపీఆర్‌డీ దాసు, అక్కల రవీంద్రరెడ్డి, స్వామిరెడ్డి, తదిచతరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement