ప్రత్తిపాడు: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను వట్టిచెరుకూరు పోలీసులు అరెస్టు చేసిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానిక పోలీస్ స్టేషనులో ఆదివారం విలేకరులతో సీఐ ఎం. రామానాయక్ వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన ప్రకారం.. వట్టిచెరుకూరు మండలం ముట్లూరుకు చెందిన అల్లం సాయి సాంబశివరావు ఉరఫ్ సాయి, అల్లం నరేంద్ర ఉరఫ్ నానిలు విలాసాలకు అలవాటై దొంగతనాలకు పాల్పడుతున్నారు. కొద్దిరోజుల కిందట ముట్లూరులోని అల్లం కిరణ్ కుమార్ ఇంట్లో, ఆయనకు చెందిన సాత్విక వే బ్రిడ్జిలో దొంగతనానికి పాల్పడ్డారు. ఆ డబ్బుతో కేజీల్లో గంజాయి కొనుగోలు చేసి ప్యాకెట్లు పరిసర గ్రామాల్లో విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి లేమల్లెపాడు నుంచి ముట్లూరు వెళ్లే డొంకలో బాపయ్య చెరువు రావి చెట్టు వద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు బృందాలుగా వెళ్లారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నాలుగు చిన్న బంగారు ఉంగరాలు, ఒక జత వెండి పట్టీలు, రెండు కేజీల గంజాయి, కంప్యూటర్ సీపీయూ, మోనిటర్, హెచ్పీ ప్రింటర్, దొంగతనాలకు వినియోగిస్తున్న ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అల్లం సాంబశివరావును పోలీసులు విచారించగా గతంలో గ్రామ సచివాలయంలో దొంగతనానికి పాల్పడినట్లు అంగీకరించాడని సీఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఒకే కాన్పులో
ముగ్గురు జననం
గుంటూరు మెడికల్: హైదరాబాద్కు చెందిన పద్మావతి(24)కి ఐదేళ్ల కిత్రం వివాహం జరిగింది. నాటి నుంచి పిల్లలు లేక అనేక ఆసుపత్రులకు తిరిగి ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో గుంటూరు సిటిజన్ హాస్పిటల్కు చికిత్స కోసం వచ్చారు. గైనకాలజిస్ట్ డాక్టర్ భాగ్యలక్ష్మి వైద్య పరీక్షలు చేసి సంతాన చికిత్స అందించారు. గర్భం దాల్చి ఆదివారం ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. ఇది చాలా అరుదుగా జరుగుతుందని డాక్టర్ భాగ్యలక్ష్మి తెలిపారు. ముగ్గురు ఆడశిశువులని, ఇరువురు 1.5 కేజీలు, ఒక శిశువు 1.4 కేజీలు ఉన్నట్లు చెప్పారు. వైద్య చికిత్సలో పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాజా సహకారం అంంచినట్లు పేర్కొన్నారు.
ఇద్దరు గంజాయి విక్రేతలు అరెస్టు