రేషన్‌ బియ్యం స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ బియ్యం స్వాధీనం

Mar 15 2025 1:48 AM | Updated on Mar 15 2025 1:47 AM

తాడికొండ: తాడికొండ మండలం నిడుముక్కలలో అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన 16 రేషన్‌ బియ్యం మూటలను గురువారం అర్ధరాత్రి పౌర సరఫరాల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిడుముక్కల దర్గాల ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఈ మూటలను పట్టుకున్నారు. వీటిని తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూటలను రేషన్‌ షాప్‌ నంబర్‌ 12కు అప్పగించినట్లు రెవెన్యూ ఆర్‌ఐ హనుమంతరావు వెల్లడించారు.

మాణిక్యవేల్‌కు నివాళి

నగరంపాలెం (గుంటూరు వెస్ట్‌): ట్రిపుల్‌ ఎక్స్‌ సోప్‌ అధినేత డాక్టర్‌ అరుణాచలం మాణిక్యవేల్‌ (77) అంత్యక్రియుల శుక్రవారం జరిగాయి. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచిన విషయం విధితమే. అరండల్‌పేట 10/2వ అడ్డరోడ్డులోని ఆయన నివాస గృహంలో సందర్శకుల సందర్శనార్థం ఉంచారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, వైఎస్సార్‌సీపీ గుంటూరు, పల్నాడు జిల్లాల పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి, వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షురాలు షేక్‌.నూరిఫాతిమా, ఎమ్మెల్యేలు గళ్లా మాధవి (పశ్చిమ), నసీర్‌అహ్మాద్‌ (తూర్పు), ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, పేరొందిన ప్రముఖులు ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మాణిక్యవేల్‌ అంత్యక్రియలు కొరిటెపాడులోని శశ్మానవాటికలో జరిగాయి. కుటుంబ సభ్యులు, ట్రిపుల్‌ ఎక్స్‌ సోప్‌ ఉద్యోగులు, సిబ్బంది పెద్ద ఎత్తున తరలివెళ్లారు.

రేషన్‌ బియ్యం స్వాధీనం 
1
1/1

రేషన్‌ బియ్యం స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement