బాపట్ల: అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం బాపట్లలో జరుగుతుందని పరిషత్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్లవరపు పవన్కుమార్ తెలిపారు. శుక్రవారం స్థానిక ఏబీవీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పవన్కుమార్ మాట్లాడారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులతోపాటు కార్యవర్గ సభ్యులందరూ పాల్గొంటారని తెలిపారు. విద్యారంగంలో వస్తున్న మార్పులపై చర్చించటంతోపాటు ఏబీవీపీ భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చిస్తామని తెలిపారు.
బీజేపీ నాయకుడిపై పలువురి దాడి
రేపల్లె రూరల్: పాత కక్షల నేపథ్యంలో వ్యక్తిపై దాడిచేసి తీవ్రంగా గాయపర్చిన సంఘటన నగరం మండలం బోరమాదిగపల్లిలో చోటుచేసుకుంది. బోరమాదిగపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నగరం మండల అధ్యక్షుడు జుజ్జువరపు సురేష్కు అదే గ్రామానికి చందిన చందోలు వీరయ్యతో కొంత కాలంగా మనస్పర్ధలు ఉన్నాయి. వీరయ్య మరి కొంతమంది గురువారం రాత్రి గ్రామ సమీపంలో కాపుకాసి ఇంటికి వెళ్తున్న సురేష్పై దాడికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు కేకలు వేయటంతో వీరయ్యతోపాటు దాడికి ఉపక్రమించిన వారు పారిపోయారు. సురేష్ను వైద్య చికిత్సల కోసం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరయ్యతోపాటు దాడికి పాల్పడిన వారు మంకీ క్యాప్ ధరించి ఉన్నారని బాధితుడు పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నగరం ఎస్ఐ భార్గవ్ తెలిపారు. సురేష్పై దాడి సంఘటన తెలుసుకున్న బీజేపీ నాయకులు బేతపూడి వెంకటేశ్వరరావు, పిన్ని సాంబశివరావులు పరామర్శించి దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
పాతకక్షలతో ఓ వ్యక్తిపై దాడి
రేపల్లె రూరల్: పాతకక్షల నేపథ్యంలో వ్యక్తిపై దాడికి పాల్పడిన సంఘటన మండలంలోని జంగాలపాలెంలో చోటుచేసుకుంది. పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న కొమరాబత్తిని శ్యామ్కుమార్పై అదే గ్రామానికి చెందిన కనపర్తి నాగేంద్రబాబు గురువారం రాత్రి కత్తితో దాడికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు నాగేంద్రబాబును అడ్డుకుని తీవ్రంగా గాయపడిన శ్యామ్కుమార్ను రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ మల్లికార్జునరావు తెలిపారు.
రేపు ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం