బాపట్ల ఎస్పీ తుషార్ డూడీ
అద్దంకి రూరల్: శింగరకొండ తిరునాళ్లకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. గురువారం తిరునాళ్ల సందర్భంగా శింగరకొండ దేవస్థానాన్ని ఎస్పీ సందర్శించారు. ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ తిరునాళ్లకు 3 లక్షల మంది భక్తుల వరకు వచ్చే అవకాశం ఉన్నందున దానికి అనుగుణంగా 650 మంది పోలీసులు, నలుగురు డీఎస్పీలు, 13 మంది సీఐలు, 46 మంది ఎస్సైలతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. దొంగతనాలు ఇతర అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా 70 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బహిరంగ ప్రదేశాలు, పార్కింగ్ ప్రదేశాల్లో నిఘా కోసం 2 డ్రోన్లను వినియోగిస్తున్నట్లు తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ప్రజలకు సహాయం అందించేందుకు దేవాలయ ప్రాంగణంలో పోలీస్ కంట్రోలు రూమ్ ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో చీరాల డీఎస్పీ మొయిన్, ఎస్బీసీఐ నారాయణ, అద్దంకి సీఐ సుబ్బరాజు, అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జున, ఇంకొల్లు సీఐ రమణయ్య పోలీస్ అధికారులు పాల్గొన్నారు.