శుక్రవారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2025
ఇఫ్తార్ సహర్
(శుక్ర) (శని)
బాపట్ల 6.23 5.00
నరసరావుపేట 6.25 5.02
గుంటూరు 6.23 5.00
● గగ్గోలు పెడుతున్న ఆక్వా రైతులు ● భారీగా తగ్గిన ఎగుమతులు
చీరాల: రొయ్య ధరలు రోజురోజుకీ పతనమవుతున్నాయి. రోజుకి రూ.10 చొప్పున తగ్గిపోతుండడంతో ఆక్వా రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎగుమతిదారులు ప్రస్తుతం ఏ కారణం చెప్పకుండానే ధరలు తగ్గించేస్తున్నారు. దళారులు సిండికేట్గా ఏర్పడి మరింత పతనం చేస్తున్నారు. దీని వల్ల ఎకరాకు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లుతోంది. గత నెల రొయ్యల ధరలతో లెక్కిస్తే రూ.4 వేల కోట్లు ఆదాయం రావాల్సి ఉంది. అయితే ప్రస్తుత ధరలతో రూ.3.5 వేల కోట్లకు పడిపోయింది.
యూటర్న్..
భారతదేశం నుంచి రొయ్య ఎగుమతులు ఎక్కువగా యూరోపియన్ దేశాలకు వెళుతుంటాయి. యూరప్లోని పది దేశాల్లో ఆంధ్రా రొయ్యలకు మంచి డిమాండ్ ఉంది. అయితే కొంతమంది రైతులు అత్యుత్సాహానికి వెళ్లి నిషేధిత యాంటీ బయోటిక్స్ సాగులో వాడడం వల్ల యూరోపియన్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కృష్ణపట్నం, విశాఖపట్నం, కాకినాడ నౌకాశ్రయాల ద్వారా ఎగుమతవుతున్న ప్రతి రెండు కంటెయిన్లలో ఒక దానికి శాంపిల్స్ తీస్తున్నారు. యాంటీ బయోటిక్స్ ఉన్నట్లు తేలితే ఎగుమతులు చేసే లైసెన్సులు రైతులు కోల్పోతున్నారు. అమెరికా దేశానికి ఎగుమతి అయ్యే రొయ్య ఉత్పత్తుల శాంపిల్స్ తక్కువగా తీస్తుండడంతో ఎక్కువ మంది రైతులు ఆ దేశం వైపు మొగ్గు చూపుతున్నారు.
మామూళ్ల మత్తులో అధికారులు
నాణ్యమైన సీడ్ అందేలా చూడాల్సిన కోస్టల్ ఆక్వా అఽథారిటీ, మత్స్యశాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. వాస్తవానికి మత్స్యశాఖ అధికారులు నెలకు రెండు సార్లు హేచరీలను పరిశీలించి ఆయా యజమానులకు నాణ్యమైన సీడ్ ఉత్పత్తులపై పలు చూచనలు, సలహాలను ఇవ్వాల్సి ఉంది. అయితే గత ఆరు నెలలుగా అలా జరగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఒకప్పుడు జిల్లా తీరం వెంబడి దాదాపు 40 వేల హెక్టార్లలో ఆక్వా సాగు చేసేవారు. ప్రస్తుతం 10 వేల హెక్టార్లకు పడిపోయింది.
స్టోరేజీ సౌకర్యం లేకనే..
జిల్లా నుంచి ప్రతి ఏడాది దాదాపు 1.70 లక్షల టన్నుల రొయ్యలను ఉత్పత్తి చేస్తుంటారు. ధరలు ఆశాజనకంగా లేనప్పుడు వాటిని నిల్వ చేసుకునేందుకు సరైన స్టోరేజీలు లేకపోవడంతో సగానికి తెగనమ్ముతున్నారు. ఇక కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. జిల్లాలోని కౌలు రైతులకు ప్రాంతాన్ని బట్టి కౌలు నిర్ణయించారు. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు కౌలు ధర ఉంది. ప్రస్తుత ధరలతో పోల్చి చూస్తే కౌలు రైతుకు చివరకు మిగిలేది అప్పులే..
ప్రస్తుతం రొయ్యల ధరలు ఇలా...
కౌంట్ ఫిబ్రవరి మార్చిలో
40 రూ. 410 రూ. 340
50 రూ. 370 రూ. 335
60 రూ.345 రూ.210
70 రూ.310 రూ.275
80 రూ. 290 రూ.250
90 రూ.270 రూ.235
100 రూ. 260 రూ.220
న్యూస్రీల్
నాసిరకం సీడ్ ఫీడ్..
హేచరీలు అధిక ధరలతో నాసిరకం సీడ్ అంటగడుతున్నాయి. దీన్ని చెరువుల్లో పోసిన పది రోజులకే రొయ్య పిల్లలు విపరీతంగా చనిపోతున్నాయి. వాటిల్లో కొన్ని బతికి బయటపడ్డా అవి సమాన గ్రోత్ రావడం లేదు. వాటిని అమ్ముకుందామంటే రొయ్యల ప్రాసెస్ కంపెనీ వ్యాపారులు సిండికేట్లుగా ఏర్పడి అందినకాడికి దోసుకుపోతున్నారు. ప్రాసెస్ కంపెనీ వ్యాపారులదీ అదే పరిస్థితి.
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల
బాపట్ల