జె.పంగులూరు: వేగంగా ప్రయాణిస్తూ నిద్ర మత్తులోకి జారుకొని ఎదురుగా వెళుతున్న సిమెంట్ లారీని ఢీకొన్న ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున మండలంలోని రేణింగవరం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. రేణింగవరం ఎస్ఐ వినోద్బాబు తెలిపిన వివరాలు ప్రకారం.. విశాపట్నం నుంచి తిరుపతికి వెళుతున్న ఆర్టీసీ బస్సు బుధవారం తెల్లవారుజామున రేణింగవరం సమీపంలోకి వచ్చింది. ఆదే సమయంలో డ్రైవర్ కె. శేఖర్ నిద్రమత్తులోకి జారుకుని ఎదురుగా వెళుతున్న సిమెంట్ లారీని ఢీకొట్టాడు. వెంటనే తేరుకొని ఎడమవైపు బస్సును తిప్పడంతో పొలాల్లోకి వెళ్లింది. బస్సు ముందువైపు భాగంగా బాగా దెబ్బతింది. బస్సు డ్రైవర్ శేఖర్ కాళ్లకు బాగా గాయాలయ్యాయి. సీటు వద్ద ఇరుక్కుపోయాడు. హైవే సిబ్బంది వచ్చి అతడిని బయటకు తీశారు. డ్రైవర్ది చిత్తూరు జిలా నెమలికుంట గ్రామం. ప్రమాద సమయంలో ఆ బస్సులో 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని, వారిని ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఎస్ఐ వినోద్బాబు తెలిపారు. డ్రైవర్ శేఖర్ను అద్దంకి ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.