వైఎస్సార్ సీపీ నిర్వహించిన ‘యువత పోరు’ ర్యాలీకి బాపట్ల జిల్లాలో అనూహ్య స్పందన లభించింది. బారికేడ్లు పెట్టి అడుగడుగునా నేతలను పోలీసులతో అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. పట్టణంలోని రథం బజారులో గల వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి కలెక్టర్ట్ వరకు నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. కలెక్టరేట్ వద్ద కూడా ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరింపజేసింది. ఒకానొక దశలో పోలీసులు, వైఎస్సార్ సీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. ఈ సమయంలో మెరుపు వేగంతో అశోక్బాబు, పార్టీ శ్రేణులు బారికేడ్లు దాటుకొని కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లిపోయారు. ఆయన వెంటే లోపలికి నేతలు, పార్టీ శ్రేణులు ప్రవాహంలా కదిలారు. – సాక్షి ప్రతినిధి, బాపట్ల
యువత పోరులో నిరసనల హోరు
యువత పోరులో నిరసనల హోరు