ప్రజలకు దక్కని వాటా | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు దక్కని వాటా

Jan 10 2026 8:12 AM | Updated on Jan 10 2026 8:12 AM

ప్రజలకు దక్కని వాటా

ప్రజలకు దక్కని వాటా

నాడు–నేడు ఎంత తేడా!

సాక్షి ప్రతినిధి, కడప: కడప ద్విశతాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కడపోత్సవాలు సైతం అదే తీరున చేపట్టారు. ఆ కార్యక్రమాల్లో జిల్లా కళాకారులకు ప్రాధాన్యత, చరిత్రకారులకు భాగస్వామ్యం దక్కింది. జిల్లా వ్యాప్తంగా ఉత్సవాన్ని స్వంత పండుగలా చేపట్టారు. ఇపుడు తద్భిన్నంగా గండికోట ఉత్సవాలు కొనసాగుతున్నాయి. జిల్లా భాగస్వామ్యం కొరవడింది. సినీ కళాకారులకే పరిమితమైంది. అది కూడా ఇరువురు సింగర్స్‌, డ్రమ్స్‌ నిర్వాహకుడు ఒకరికి మాత్రమే పరిమితమైంది. దీంతో ఉత్సవాల నిర్వహణలో నాటికి, నేటికి ఎంత తేడా ఉందో విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

● కడపోత్సవాలను అప్పటి కలెక్టర్లు జయేష్‌రంజన్‌, అశోక్‌కుమార్‌..కడప ద్విశతాబ్ది ఉత్సవాలను కృష్టబాబు అద్భుతంగా నిర్వహించారు. ఇప్పటికీ జిల్లా వాసులకు గుర్తుండిపోయేలా నాటి కార్యక్రమాలను చేపట్టారు. జిల్లాలోని అన్ని రంగాల ప్రముఖులను భాగస్వామ్యులను చేశారు. జిల్లా వ్యాప్తంగా చరిత్రకారులు, కళాకారులు, రాజకీయ నేతలు, మీడియా ప్రతినిధులతో చర్చించారు. ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే దిశగా కార్యచరణ ముందే సిద్ధం చేశారు. అప్పటి అధికారుల చిత్తశుద్ధి కారణంగానే అత్యంత పారదర్శకంగా చరిత్రలో గుర్తుండిపోయేలా ఉత్సవాలు చేపట్టారు.

సమష్టి కార్యాచరణతో కడప ద్విశతాబ్ది, ఉత్సవాలు

అంగరంగ వైభవంగా నాటి పాలకుల నిర్వహణ

నేడు గండికోట ఉత్సవాల్లో కన్పించని నాటి ప్రణాళిక

స్థానిక చరిత్రకారులు,కళాకారులకు దక్కని ప్రాధాన్యత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement