
బీజేపీని వ్యతిరేకించే ఏకై క పార్టీ కాంగ్రెస్
రాయచోటి జగదాంబసెంటర్ : బీజేపీని వ్యతిరేకించే ఏకై క పార్టీ కాంగ్రెస్ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి పేర్కొన్నారు. రాయచోటి పట్టణం మదనపల్లె రోడ్డు మార్గంలోని పీసీఎస్ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన షర్మిలారెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పది సంవత్సరాలుగా ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేస్తున్నారని, విభజన హామీలలో ఏ ఒక్కటీ బీజేపీ నెరవేర్చలేదన్నారు. పోలవరం, రాజధాని అభివృద్ధి విషయంలోనూ అన్యాయం చేశారని, అధికార, ప్రతిపక్ష పార్టీలు బీజేపీకి పనిచేస్తున్నాయన్నారు. ప్రజల పక్షాన ప్రజా సమస్యల మీద ఏ పార్టీ నిలబడటం లేదని, కాంగ్రెస్ పార్టీ నిలబడుతోందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని సూపర్ సిక్స్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నెరవేర్చలేదని, రైతులకు రైతు భరోసా, మహిళలకు మహాశక్తి, తల్లికి వందనం, నిరుద్యోగభృతి గాలికి వదిలేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గాజుల భాస్కర్, జిల్లాలోని నియోజకవర్గ ఇన్చార్జులు, సీనియర్ పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి