
పీఎంఎస్ పథకంపై విస్తృత ప్రచారం చేయాలి
రాయచోటి : ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని విస్తృతంగా ప్రచారం చేసి విద్యుత్ వినియోగదారులకు అవగాహన కల్పించాలని విద్యుత్ చీఫ్ జనరల్ మేనేజర్ జానకిరామ్ ఆదేశించారు. మంగళవారం రాయచోటిలోని అన్నమయ్య జిల్లా ఎస్ఈ కార్యాలయంలో పీఎంఎస్ పథకం అమలు విధివిధానాలపై ట్రాన్స్కో అధికారులతో ఆయన సమీక్షించారు. వినియోగదారులకు, రైతులకు నాణ్యమైన విద్యుత్ను అందించాలని విద్యుత్ శాఖ అధికారులకు ఆయన సూచించారు. జిల్లాలోని నాలుగు డివిజన్ల పరిధిలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లతో ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని విద్యుత్ వినియోగదారులకు అవగాహన కల్పించే విషయంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో అన్నమ య్య జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆర్. చంద్రశేఖర్రెడ్డి, రాయచోటి, పీలే రు, రాజంపేట, మదనపల్లి డివిజన్ల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పి.యుగంధర్, వై.చంద్రశేఖర్రెడ్డి, ఎన్.రాజశేఖర్రెడ్డి, గంగాధర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
5న పర్యావరణ
దినోత్సవ వేడుకలు
– జిల్లా కలెక్టర్ శ్రీధర్
రాయచోటి : రాజంపేటలో ఈ నెల 5న నిర్వహించనున్న ప్రపంచ పర్యావరణ వేడుకలు, 7న నిర్వహించబోయే యోగా కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ మీడియాకు వివరించారు. మంగళవారం సాయంత్రం రాయ చోటి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పాత్రికేయ సమావేశంలో మాట్లాడారు. రాజంపేటలోని నగరవనంలో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు జరగనున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో 5 లక్షల మొక్కలు నాటుతామన్నారు.
నాటుసారాపై
ఫిర్యాదు చేయండి
రాయచోటి : అన్నమయ్య జిల్లాను నాటుసారా రహితంగా రూపొందించడమే లక్ష్యంగా సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాయచోటి కలెక్టరేట్ మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎకై ్సజ్ ప్రొహిబిషన్ శాఖ ఆధ్వర్యంలో నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా జిల్లాలో నాటుసారా నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 191 కేసులు నమోదు చేయగా, 169 మందిని అరెస్టు చేశారని, 11,224 లీటర్ల నాటుసారా సీజ్ చేశామన్నారు. ఈ సమావేశంలో ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ జయరాజు, సూపరింటెండెంట్ జి మధుసూదన్, సహాయ సూపరింటెండెంట్ వై జోగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

పీఎంఎస్ పథకంపై విస్తృత ప్రచారం చేయాలి