మాజీ సీఎం ఎన్టీఆర్‌కు నివాళి | - | Sakshi
Sakshi News home page

మాజీ సీఎం ఎన్టీఆర్‌కు నివాళి

May 29 2025 12:13 AM | Updated on May 29 2025 12:13 AM

మాజీ

మాజీ సీఎం ఎన్టీఆర్‌కు నివాళి

రాయచోటి: మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావుకు అన్నమయ్య జిల్లా పోలీసులు ఘనంగా నివాళులు అర్పించారు. ఎస్పీ వి.విద్యాసాగర్‌ నాయుడు ఆదేశాల మేరకు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో బుధవారం నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రటానికి రాయచోటి డీఎస్పీ ఎంఆర్‌ కృష్ణమోహన్‌ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.పెద్దయ్య, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌లు, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది, పోలీసు సిబ్బంది, మహిళా పోలీసులు, హోంగార్డులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లో..

అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో దివంగత మాజీ సీఎం ఎన్‌టీఆర్‌ 102వ జయంతి వేడుకలను నిర్వహించారు. బుధవారం కలెక్టరేట్‌లోని ప్రజా భవనంలో కలెక్టర్‌ ఆదేశాల మేరకు డీఆర్‌ఓ మధుసూదనరావు ఆధ్వర్యంలో ఎన్‌టీఆర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్‌, జిల్లా విద్యాశాఖ అధికారి శివప్రకాష్‌రెడ్డిలు మాట్లాడారు. రాయచోటి తహసీల్దార్‌ నరసింహకుమార్‌, ల్యాండ్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ క్రాంతికుమార్‌, కోఆర్డినేషన్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ రెడ్డప్పరెడ్డి, కలెక్టరేట్‌ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

భారతి సిమెంట్స్‌ను వినియోగించండి

గాలివీడు : గ్రామీణ ప్రాంతాలలో గృహాలు, కట్టడాలకు భారతి సిమెంటు వాడుతూ నాణ్యత పెంచుకోవాలని భారతి సిమెంట్స్‌ ప్రతినిధులు సూచించారు. బుధవారం వారు స్థానిక డీలర్‌ ఆధ్వర్యంలో గృహ నిర్మాణదారులు, బేల్దార్లు, బిల్డర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓబీసీ 53 గ్రేడ్‌తో నాణ్యమైన సిమెంటును సరఫరా చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ భారతి సిమెంటును వాడి నాణ్యత మేరకు తమ కట్టడాలను శాశ్వతం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో భారతి సిమెంట్స్‌ యాజమాన్యం, పలువురు బేల్దార్లు, గృహాల యజమానులు పాల్గొన్నారు.

మాజీ సీఎం ఎన్టీఆర్‌కు నివాళి1
1/2

మాజీ సీఎం ఎన్టీఆర్‌కు నివాళి

మాజీ సీఎం ఎన్టీఆర్‌కు నివాళి2
2/2

మాజీ సీఎం ఎన్టీఆర్‌కు నివాళి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement