మహానాడుతో రాష్ట్రానికి ఒరిగింది శూన్యం | - | Sakshi
Sakshi News home page

మహానాడుతో రాష్ట్రానికి ఒరిగింది శూన్యం

May 29 2025 12:12 AM | Updated on May 29 2025 12:12 AM

మహానాడుతో రాష్ట్రానికి ఒరిగింది శూన్యం

మహానాడుతో రాష్ట్రానికి ఒరిగింది శూన్యం

రైల్వేకోడూరు అర్బన్‌: కడపలో టీడీపీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహిస్తున్న మహానాడుతో రాష్ట్రానికి ఒరిగింది శూన్యమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు విమర్శించారు. కేవలం గతప్రభుత్వాన్ని విమర్శించడం, లోకేష్‌ను పొగుడుకోవడంతోనే రెండురోజులు సరిపెట్టారన్నారు.జనం లేక మహానాడు వెలవెలబోయిందని అన్నారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అమలు చేయలేని హామీలతో ప్రజలను నమ్మించి ఓట్లు దండుకొని, పథకాలు ఎగ్గొట్టి పండుగ చేసుకుంటున్నారని తెలిపారు. ప్రజలకు చేసిన మోసాలకు చివరకు వరుణుడు కూడా ఆగ్రహించారని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు హామీ ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ పథకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అన్నిరంగాల్లో గత ప్రభుత్వం యువతకు అందించిన ఉద్యోగాలు పీకేసి, గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు ప్రారంభించుకుంటూ ఏ ముఖం పెట్టుకొని మహానాడు నిర్వహిస్తున్నారని విమర్శించారు. జనాలు రాకపోవడంతో డ్వాక్రాసంఘాలు, గ్రామాల్లోని ప్రజలను మహానాడుకు రాకుంటే పథకాలు రావంటూ కొందరు అధికారులు బలవంతంగా మూడోరోజుకు తరలించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. మహిళలు, యువతులు మాయమవుతున్నా పవణ్‌కళ్యాణ్‌ పట్టించుకోలేదని, ఒక్కమాట కూడా మాట్లాడలేదన్నారు. వైఎస్‌ జగన్‌ హయాంలో ప్రజలకు అన్ని పథకాలు అందించారని గుర్తు చేశారు. క రోనా కష్టకాలం ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలకు కేటాయించిన నిధులు, ఇప్పుడు చంద్రబాబు కే టాయించిన నిధుల గురించి ప్రజలు గమనించా లన్నారు. రెడ్‌బుక్‌తోనే పరిపాలన చేయాలని తండ్రీకొడుకులు, పవన్‌కళ్యాణ్‌ చూస్తున్నారని తెలిపారు. జగనన్న పరిపాలన విలువ ఇప్పుడు ప్రజలకు తెలుస్తోందని పేర్కొన్నారు.

మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement