
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
రాయచోటి: ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ఈనెల 26వ తేదిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ తెలిపారు. జిల్లా కేంద్రం రాయచోటితోపాటు గ్రామ, మండల డివిజన్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమం ఉంటుందన్నారు.
మత్స్యశాఖ డీడీగా రాఘవరెడ్డి
కడప అగ్రికల్చర్: వైఎస్సార్ జిల్లా మత్స్యశాఖ ఎఫ్ఏసీ డిప్యూటీ డైరెక్టర్గా నంద్యాల జిల్లా జేడీగా పని చేస్తున్న రాఘవరెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం కడప ఏడీగా పని చేస్తున్న రెడ్డెయ్య ఎఫ్ఏసీ డీడీ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన స్థానంలో రాఘవరెడ్డిని నియమించారు. ఈయన ఒకటి, రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు.
విజయవంతానికి
చర్యలు తీసుకోవాలి
కడప రూరల్: మహానాడు విజయవంతానికి అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రులు తెలిపారు. కడప నగర శివారులోని మహానాడు ప్రాంగణంలో జరుగుతున్న సన్నాహాక కార్యక్రమాలను వారు పరిశీలించారు. అనంతరం ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో నిర్వహించిన సమావేశంలో అచ్చెన్నాయుడు, నారాయణ, గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు కలిసికట్టుగా పని చేయాలన్నారు. భద్రత, వసతి, వేదికలు, రవాణాతోపాటు ఇతర అంశాలపై దృష్టి సారించాలన్నారు. ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లా నేతలు పాల్గొన్నారు.
విద్యా వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యార్థులదే
మదనపల్లె సిటీ: విద్యా వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యార్థులదేనని ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు విపి సాను అన్నారు. ఆదివారం మద న పల్లె సమీపంలోని అంగళ్లు విశ్వం ఇంజినీరింగ్ కాలేజీలో జరుగుతున్న ఎస్ఎఫ్ఐ రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక శిక్షణా తరగతులకు హాజర య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు పేదవారికి విద్య అనేది అందని ద్రాక్షగానే మారిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకు వస్తున్న విద్యా వ్యతిరేక విధానాలు విద్యార్థులకు విద్యను మరింత దూరం చేస్తున్నాయని విమర్శించారు. నూతన జాతీయ విద్యా విద్యావిధానం పేరుతో విద్యలో కాషాయీకరణ, కేంద్రీకరణ, కార్పొరేటీకరణను కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తోందన్నారు. దీనిని విద్యార్థులందరూ ప్రతిఘటించాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్నకుమార్, జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు నరసింహ, రమణ, నాయకులు రామమోహన్, అబ్దుల్లా, నవిత, ప్రవళ్లిక, వివిధ జిల్లాల ప్రతినిధులు హాజరయ్యారు.
మహానాడు తెచ్చిన తిప్పలు
కడప సెవెన్రోడ్స్: టీడీపీ మహానాడు వల్ల మంగళవారం ఏపీ ఈఏపీ సెట్–2025 పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు తిప్పలు తప్పేటట్లు లేవు. నగర శివారులోని పబ్బాపురంలో ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలి రానున్నారు. మహానాడు తొలిరోజే ఏపీ ఈఏపీ సెట్ పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. నగరంలోని కందుల ఓబుల్రెడ్డి మెమోరియల్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్, కేఎస్ఆర్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, కేఎల్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్, అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ పరీక్షా కేంద్రాలకు కేటాయించిన విద్యార్థులు పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ పరీక్షా కేంద్రాలన్నీ మహానాడు నిర్వహించే ప్రాంతానికి సమీపంలో ఉండటమే కారణం. సాధారణంగా ఉండే ట్రాఫిక్తోపాటు మహానాడు కార్యక్రమానికి వచ్చే వాహనాలతో పలు చోట్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. అందుకే విద్యార్థులు ఈ పరీక్షా కేంద్రాలకు ఉదయం 7.30 గంటల్లోపే చేరుకోవాలని ఏపీ ఈఏపీ సెట్–2025 చైర్మన్, జేఎన్టీయూ కాకినాడ ఉప కులపతి ప్రొఫెసర్ సీఎస్ ఆర్కే ప్రసాద్ ఒక ప్రకటనలో సూచించారు.

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక