
మహిమాన్వితుడు బత్తులయ్య స్వామి
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి
రాజంపేట: మహిమాన్వితుడు బత్తులయ్య స్వామి అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్రెడ్డి అన్నారు. ఆదివారం బత్తులయ్య సమాధి వద్ద ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బత్తులయ్య 300 సంవత్సరాల క్రితం జీవసమాధి అయ్యారన్నారు. ఆకేపాడు తదితర ప్రాంతాల్లో అనేకమంది బత్తులయ్య స్వామిపై భక్తి భావాలను చూపారన్నారు. ఆయన జీవసమాధి ఒక చరిత్రాత్మకమన్నారు. ఆయన వెంట స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, గ్రామపెద్దలు, భక్తులు పాల్గొన్నారు.
ప్రజలను చల్లగా చూడాలి తల్లి..
కోరిన కోర్కెలు తీర్చే తల్లి అనంతపురం తల్లిగా భక్తులు కొలుచుకుంటున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట శాసనసభ్యుడు ఆకేపాటి అమరనాఽథ్రెడ్డి అన్నారు. ఆదివారం బాలిరెడ్డిపల్లెలో వెలసిన అనంతపురమ్మ తల్లి పొంగుబాళ్ల మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని పూజలు నిర్వహించారు. ప్రజలను చల్లగా చూడాలని ఆయన ప్రార్థించారు.