వెరిటాస్‌ సైనిక్‌ స్కూల్‌కు భారత ప్రభుత్వం అనుమతి | - | Sakshi
Sakshi News home page

వెరిటాస్‌ సైనిక్‌ స్కూల్‌కు భారత ప్రభుత్వం అనుమతి

May 11 2025 7:29 AM | Updated on May 11 2025 7:29 AM

వెరిటాస్‌ సైనిక్‌ స్కూల్‌కు భారత ప్రభుత్వం అనుమతి

వెరిటాస్‌ సైనిక్‌ స్కూల్‌కు భారత ప్రభుత్వం అనుమతి

తిరుపతి కల్చరల్‌ : తిరుపతిలో గత 22 ఏళ్లుగా బీఎస్‌ఆర్‌ విద్యాసంస్థల ద్వారా క్రమశిక్షణతో కూడి విద్యతో పాటు వేలాది మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇటు విద్యార్థుల ఉన్నతికి, దేశ రక్షణకు అందిస్తున్న సేవలను గుర్తించి భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్‌ డిఫెన్స్‌ సైనిక్‌ స్కూల్‌ అనుమతి పొందిందని వెరిటాస్‌ సైనిక్‌ స్కూల్‌ చైర్మన్‌ డాక్టర్‌ బి.శేషారెడ్డి తెలిపారు. శనివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ విద్యాసంస్థల ద్వారా ఇప్పటికే సుమారు 20 వేల మంది విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంతో పాటు 6 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. అందరి సహకారంతో భారత రక్షణ దళానికి ఎంతో మంది సైనికులను అందించేలా కృషి చేశామన్నారు. వెరిటాస్‌ సైనిక్‌ స్కూల్‌ స్థాపించినప్పటి నుంచి అనుభజ్ఞులైన వారిచే అత్యుత్తమమైన విద్యాప్రమాణాలతో విద్యార్థులకు విద్యతో పాటు శారీరక, మానసిక, మానవీయ విలువలతో కూడిన విద్యను అందస్తూ ఆదరణ పొందామన్నారు. భారత ప్రభుత్వం గుర్తింపుతో మరింత బాధ్యతగా దేశ భద్రత కోసం వెరిటాస్‌ సైనిక్‌ స్కూల్‌ ముందడుగు వేస్తోందన్నారు. దేశానికి అవసరమైన విద్యను యువతకు డిఫెన్స్‌ రంగగాలలో ఎన్‌డీఏ, టీఈఎస్‌ వంటి ఉత్తమమైన ఉద్యోగ అవకాశాలను కేవలం 17 ఏళ్ల వయస్సులోనే పొందే విధంగా తీర్చిదిద్దాలని సంకలిపంచామన్నారు. ఇకపై ఆలిండియా సైనిక్‌ స్కూల్‌ ఎంట్రన్స్‌ పరీక్షల ద్వారా కౌన్సెలింగ్‌ నిర్వహించి సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. విద్యాసంస్థలో ప్లస్‌–1 ఇంటర్మీడియట్‌తో స్పెషల్‌ ఎన్‌డీఏను ప్రారంభిస్తున్నామని, ఈ అవకాశాన్ని ఆసక్తి ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో వెరిటాస్‌ సైనిక్‌ స్కూల్‌ డైరెక్టర్లు బి.శ్రీకర్‌రెడ్డి, బి.సందీప్‌రెడ్డి పాల్గొన్నారు.

వెరిటాస్‌ సైనిక్‌ స్కూల్‌ చైర్మన్‌

డాక్టర్‌ బి.శేషారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement