
విపత్తు సమయంలో అప్రమత్తంగా ఉండాలి
ఓబులవారిపల్లె : అగ్ని ప్రమాదాలు తదితర విపత్తు సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని జిల్లా అగ్నిమాపక అధికారి అనిల్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం మంగంపేట ఏపీఎండీసీలో జిల్లా అగ్నిమాపక సిబ్బంది సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు పాటించాలన్న విషయంపై అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్ ద్వారా ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఓ సుదర్శన్ రెడ్డి, తహసీల్దార్ శ్రీధర్ రావు, మైన్స్ మేనేజర్ గోపీనాథ్, ఎస్ఐ పి.మహేష్, స్పెషల్ ఫోర్స్ ఎస్ఐ శివ, ఏపీఎండీసీ, త్రివేణి ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.