
మిద్దైపె నుంచి పడి పెయింటర్ మృతి
కడప అర్బన్ : కడప నగరం రిమ్స్ పోలీసు స్టేషన్ పరిధిలో వైఎస్ఆర్ కాలనీలోని రాజేశ్వరి అనే మహిళ ఇంటికి ఈనెల 4వ తేదీన ఆదివారం పెయింటింగ్ పనిచేసేందుకు వెళ్లిన ఓబుళాపురం రాజశేఖర్ (50) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు మిద్దైపెనుంచి కింద పడటంతో మృతి చెందాడు. కడప రిమ్స్ పోలీసు స్టేషన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కలసపాడు మండల పరిధిలోని చెన్నారెడ్డిపల్లె దళిత కాలనీకి చెందిన ఓబులాపురం రాజశేఖర్, తన కుటుంబ సభ్యులతో కలిసి బతుకుదెరువు కోసం రామాంజనేయపురంలో ఉంటున్నాడు. ఇతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో మేసీ్త్ర వెంట పెయింటింగ్ వేసేందుకు వెళ్లాడు. మిద్దైపెకి వెళ్లి పెయింటింగ్ వేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. తీవ్ర గాయాలతో బాధపడుతున్న అతన్ని రిమ్స్కు తరలించారు. మధ్యాహ్నం మృతి చెందాడు. అతని కుమారుడు చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రిమ్స్ పోలీసులు తెలిపారు.