అంధురాలిని... న్యాయం చేయండి | - | Sakshi
Sakshi News home page

అంధురాలిని... న్యాయం చేయండి

May 6 2025 12:10 AM | Updated on May 6 2025 12:10 AM

అంధుర

అంధురాలిని... న్యాయం చేయండి

నాకు రెండు కళ్లు కనిపించవు. ఇద్దరు కుమారులు కూలీ చేసుకుని బతుకుతున్నారు. 2002లో అప్పటి ప్రభుత్వం నా భర్త మల్లికార్జునకు, మామకు.. తండ్రికి ఇళ్ల పట్టాలు ఇచ్చింది. మా మామ ఇల్లు వేసుకున్నాడు. నా భర్త మతిస్థిమితం లేక ఎటో వెళ్లిపోయాడు. మా వద్ద డబ్బులు లేక ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో శ్లాబు వరకు ఇంటిని కట్టుకున్నాం. ఊర్లో ఉంటే బతకడానికి కష్టంగా ఉందని నా పిల్లలు రాజంపేటకు వచ్చి పెయింట్‌ పని చేసుకుని నన్ను సాకుతున్నారు. అయితే మా మరిది సుబ్బయ్య మా మామ కట్టుకున్న ఇల్లు, మేము శ్లాబు వరకు వేసుకున్న ఇంటిని కూల్చేసి, ఆ రెండు స్థలాల్లో ఇంటిని వేసుకుంటున్నాడు. మేము పెనగలూరులో తహసీల్దార్‌, పోలీసుస్టేషన్‌కు వెళ్లి న్యాయం చేయాలని కోరాం. అధికారులు మా మరిదిని పిలిచి మాట్లాడారు. అయితే మా మరిది ఇప్పుడు మాకు కోర్టు నోటీసు పంపాడు. నేను కళ్లు లేని దానిని. నా బిడ్డలకు చదువు రాదు. సబ్‌ కలెక్టరమ్మ న్యాయం చేయాలి.

– నాగెళ్ల సుబ్బలక్షుమ్మ,

నారాయణ నెల్లూరు.పెనగలూరు మండలం

ఆఫీసుల చుట్టూ

తిప్పుకుంటున్నారు

మా రెండో బావ బసిరెడ్డి జయరామిరెడ్డికి పెళ్లి కాలేదు. అందువల్ల జయరామిరెడ్డి సంపాదించుకున్న ఐదు కుంటల భూమిని ఆ ఇంటాయన నరసింహారెడ్డికి రాయించాడు. ఒక సర్వే నంబరు కంప్యూటర్‌లోకి ఎక్కింది. మిగతా సర్వే నంబర్లు ఎక్కలేదు. ఈ విషయమై సంత్సరం నుంచి తిరుగుతున్నా. ఎవరూ పట్టించుకోవడం లేదు. మా మండల అధికారులైతే నన్ను గదమాయించి మట్లాడుతున్నారు.ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలి.

– బసిరెడ్డి సుబ్బలక్షుమ్మ, ఇండ్లూరు సాతపల్లె, పెనగలూరు మండలం

అంధురాలిని... న్యాయం చేయండి 1
1/1

అంధురాలిని... న్యాయం చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement