
సంచులకు నిప్పు.. తప్పిన పెను ప్రమాదం
వేంపల్లె : స్థానిక పులివెందుల రోడ్డులోని కందుల కాంప్లెక్స్ వెనుక ఉన్న రేకుల షెడ్డులో గోనె సంచులకు అగ్ని అంటుకుంది. వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది వచ్చి మంటలను ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. కందుల కాంప్లెక్స్ వెనుక కూరగాయలకు చెందిన వ్యాపారులు షెడ్లు వేసుకుని వాటిలో పాత గోనె సంచులు, టమాటా ట్రేలను పెట్టుకున్నారు. శనివారం గోనె సంచులు ఉన్న రేకుల షెడ్డులో మంటలు వస్తున్న విషయాన్ని స్థానికులు గమనించి ఫైర్ స్టేషన్కు సమాచారమిచ్చారు. దీంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. పక్కనే ఉన్న మరో రేకుల షెడ్డులో రోగులు, ఆస్పత్రులకు సప్లయ్ చేసే ఆక్సిజన్కు చెందిన సిలిండర్లకు మంటలు అంటుకొనే లోపలే.. అదుపు చేయడంతోపాటు సిలిండర్లపై నీటిని చల్లారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు స్థానికులు, ఫైర్ సిబ్బంది చాలా కష్టపడ్డారు. మంటల్లో మోటార్ బైకు కాలిపోయింది. ఎగిసి పడుతున్న మంటలను అదుపు చేయడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని, లేకపోతే ఆక్సిజన్ సిలిండర్లు మంటలకు పేలి ఉంటే ప్రజలు మృత్యువాత పడే అవకాశం ఉండేదని స్థానికులు వాపోతున్నారు. సహాయక చర్యల్లో అగ్నిమాపక శాఖ అధికారి శివరామిరెడ్డి, ఫైర్ సిబ్బంది ఎస్.ఎం.డి. సాలర్, మహమ్మద్ రఫీ, సురేంద్ర రెడ్డి, నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

సంచులకు నిప్పు.. తప్పిన పెను ప్రమాదం